పద్మజారెడ్డికి సలహాదారు పదవి !

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసిందేమో కానీ పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్న వారందర్నీ గుర్తించి సలహాదారు పోస్టు ఇచ్చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వారానికొక సలహాదారును నియమిస్తున్నారు. ఒక్కొక్కరికి.. మూడు..నాలుగు లక్షల ప్రజాధనాన్ని ఇస్తున్నారు. తాజాగా.. వైసీపీ అధికార ప్రతినిధి పేరుతో మీడియా ముందుకు వచ్చి విపక్ష నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టే నారమల్లి పద్మజ అనే నాయకురాలికి సలహాదారు పదవి ఇచ్చేశారు.

ఇక్కడ జగన్ సామాజిక న్యాయం పాటించారు. నారమల్లి పద్మజ భర్త పేరు ఏజే సుబ్రహ్మణ్యం రెడ్డి . నారమల్లి పద్మజను మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగ, వృద్ధుల విభాగానికి సలహాదారుగా నియమించారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో అనూరాధ స్పష్టం చేశారు. ఈ మేరకు పద్మజతో పాటు సంబంధిత విభాగాలకు కూడా ఉత్తర్వుల కాపీని పంపించారు.

కాంగ్రెస్‌లో ఉండే నారమల్లి పద్మజను జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం పని చేశారు. అయితే గత నాలుగేళ్లుగా ఆమె పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వారందరికీ ఏదో ఓ పదవి ఉంటే.. కనీసం అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉంటారని పదవుల పంపకాన్ని జగన్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 80 మంది వరకూ సలహాదారులు ఉంటారు. ఇక ముందు కూడా ఈ నియామకాల పరంపర కొనసాగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close