లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో మాట్లాడారు. వారిలో మరింత స్ఫూర్తి నింపారు. లద్దాఖ్‌లోని నిము ప్రాంతానికి మోడీ వెళ్లారు. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని మాట్లాడారు. ప్రపంచం మొత్తానికి భారత్‌ శక్తి సామర్థ్యాలు నిరూపించామని సైనికులను అభినందించారు.

జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతంగా ఉందని.. విస్తరణకాంక్షతో సాగిన శక్తులు తోకముడవడమో లేక ఓటమో చవిచూశాయని చరిత్రలో ఇదే ఉందని గుర్తు చేశారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొద్ది కొద్దిగా దేశ భూభాగంలోకి వస్తూనే ఉంది. అయితే సైనిక చర్చల పేరుతో.. చైనా.. భారత్ ను నిలువరిస్తోంది. మరో వైపు చేయాల్సిన పని చేస్తోంది. ఈ సమయంలో చైనాను నిలువరించడానికి మోడీ వ్యూహాత్మకంగా సరిహద్దులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇంక ఏ మాత్రం.. సహించే ప్రశ్నే లేదని.. అవసరం అయితే యుద్ధానికి సైతం సిద్ధమన్న సంకేతాలను మోడీ చైనాకు పంపారని అంటున్నారు. సరిహద్దు వద్ద మోడీ పర్యటించడంతో.. చైనా ఉలిక్కి పడింది.

ప్రత్యేకంగా ఎలాంటి పేరు చెప్పకుండా… ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని.. ఎవరూ పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించకూడదని నీతుల ప్రకటన చేసింది. మోడీ లద్దాఖ్ పర్యటన.. అంతర్జాతీయంగానూ హైలెట్ అయింది. ఇంత కాలం భారత్ ఇరుగు పొరుగు దేశాలతో శాంతిని కోరుకుందని.. ఇప్పుడు తమ భూభాగంపైనే కన్నేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు అయిందన్న విశ్లేషణ అంతటా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close