బందరు పోర్టుపైనా కోర్టుకెళ్లిన నవయుగ..!

కాంట్రాక్టుల రద్దుపై ఏపీ సర్కార్ తో… తాడో పేడోతేల్చుకోవాలని నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ రెడీ అయినట్లుగా… తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ టెండర్లపై.. హైకోర్టుకు ఎక్కి .. మధ్యంతర విజయం సాధించిన నవయుగ కంపెనీ.. తాజాగా మచిలీపట్నం పోర్టు విషయంలోనూ… ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయాన్ని కొట్టి వేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్ వేసింది. పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. ఏపీ సర్కార్ ఆగస్టు ఎనిమిదో తేదీన జారీ చేసిన అరవై ఆరో నెంబర్ జీవోను రద్దు చేయాలని కోర్టులో వేసిన పిటిషన్లో నవయుగ సంస్థ కోరింది. పనులు ఇతర సంస్థలకు అప్పగించకుండా ఆదేశించాలని కోరింది. జీవోలో ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు చెప్పిందని.. తాము పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించలేదని.. నయువగ తెలిపింది.

నవయుగ హైకోర్టులో పిటిషన్ వేస్తున్న సమయంలోనే… మంత్రివర్గ సమావేశంలో.. బందరు పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ… ఆ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ.. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ.. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. నవయుగ మాత్రం ప్రభుత్వమే.. ఒప్పందం మేరకు అవసరమైన భూములను తమకు అప్పగించడంలో విఫలమైందని పిటిషన్‌లో పేర్కొంది. పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన రవాణా, విద్యుత్‌ తదితర సదుపాయాలను కూడా సమకూర్చలేదని, అందువల్ల ప్రభుత్వమే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినట్లయిందన్నారు. పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనుల కోసం ఇప్పటికే రూ.436కోట్లు వ్యయం చేశామని నవయుగ కోర్టుకు తెలిపింది.

బందరుపోర్టు అభివృద్ది ఒప్పందాన్ని ఇండియన్‌ కాంట్రాక్టు యాక్టు 1872 ప్రకారం… ఏపీ సర్కార్ రద్దు చేసింది. రద్దు చేసే సమయానికి బందరు పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. నవయుగ సంస్థ ప్రాజెక్టు స్థలం వద్దకు భారీ యంత్రాలను తరలించి… పనులను కూడా ప్రారంభించింది. పరిమితంగానే స్థలం స్వాధీనం చేసినా… కాస్త వేగంగా నవయుగ పనులు చేస్తోంది. అయితే ప్రభుత్వం మారగానే… పనులు నిలిచిపోయాయి. పోలవరం విషయంలో కోర్టుకెళ్లి… కాంట్రాక్టుల రద్దుపై స్టే తెచ్చుకున్న నవయుగ.. మచిలీపట్నం పోర్టు విషయంలోనూ.. అదే ఫలితాన్ని ఆశిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేయాలంటే.. ప్రభుత్వం పాటించాల్సిన కొన్ని నిబంధనలు పాటించకపోవడం.. నవయుగకు మేలు చేస్తుందన్న అభిప్రాయం.. న్యాయవాద వర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close