మధువర్షిణి అనే నేను: నయనతార రాజకీయ చిత్రమ్?

నయనతార నటించిన తమిళ హిట్ ‘ఆరమ్’. తెలుగులో శుక్రవారం ‘కర్తవ్యం’గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు మీడియా జనాలకు సోమవారం రాత్రి స్పెషల్ షో వేశారు. సినిమా సంగతి పక్కన పెడితే… సిన్మాలో అందర్నీ ఎండింగ్ ఎట్ట్రాక్ట్ చేసింది. రియలిస్టిక్ మీటర్‌లో సినిమా తీసిన దర్శకుడు, పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్‌లో ఎండ్ చేశాడు. అక్కడ డైలాగ్ అయితే టాక్ అఫ్ ది థియేటర్. ‘కర్తవ్యం’లో నయనతార పేరు మధువర్షిణి. కలెక్టర్‌గా రాజకీయ నాయకుల జోక్యంతో విసిగిన ఆమె రాజకీయాల్లోకి రావాలని అనుకుంటుంది. అనుకోవడం కాదు… వచ్చినట్టు, వచ్చి ఎన్నికల్లో నెగ్గినట్టు, ప్రమాణ స్వీకారం చేసినట్టు ప్రేక్షకులకు అర్థమయ్యేలా డైలాగులు వున్నాయి. ‘మధువర్షిణి అనే నేను… ప్రజలకు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నా’… లాస్ట్ డైలాగ్ విన్న వెంటనే ఎవరికైనా ‘భరత్ అనే నేను’ గుర్తుకు రావడం గ్యారెంటీ. పర్ఫెక్ట్ సీక్వెల్ ప్లాన్‌తో దర్శకుడు సినిమాను ఎండ్ చేశాడు. తమిళంలో నిర్మాతలు కూడా సీక్వెల్ తీస్తామని అనౌన్స్ చేశారు. కానీ, అందులో నయనతార నటిస్తుందా? లేదా? అనేది చెప్పలేదు. ‘ఆరమ్’తో తమిళనాడులో నయనతారకు లేడీ సూపర్ స్టార్ హోదా వచ్చింది. మధువర్షిణి అంటే ఆమె అన్నంతగా జీవించింది. సో.. సీక్వెల్ కూడా ఆమె నటిస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వెలిబుచ్చుతున్నారు. నయనతార మనసులో ఏముందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.