సోషల్ మీడియా సెగ: పవన్, బాబు లని ఎద్దేవా చేసిన అంబటి, ఆడుకున్న నెటిజన్లు

వైఎస్ఆర్ పీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కి నిన్నంతా సోషల్ మీడియా సెగ గట్టిగా తగిలింది. పవన్ కళ్యాణ్ , చంద్రబాబు లు కరోనా కారణంగా హైదరాబాదులోనే ఉండి పోయిన సంగతి తెలిసిందే. దానిని రాజకీయ ప్రయోజనం గా మార్చుకోవడం కోసం వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు పవన్ లు హైదరాబాద్ లోనే ఉంటూ ఆంధ్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కొంతకాలంగా హైలైట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే వీరు ఇద్దరూ హైదరాబాద్ లో జండా ఎగరవేయడాన్ని ఎద్దేవా చేస్తూ నిన్న ఉదయం అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

అంబటి రాంబాబు ట్వీట్ చేస్తూ,
“స్వాతంత్ర దినోత్సవ వేడుకలను
స్వరాష్ట్రంలో జరుపుకోలేని
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు
రాష్ట్ర రాజకీయాల గురించి
మాట్లాడే అర్హత ఉందంటారా ?” అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను ఎద్దేవా చేశారు.

అయితే ఊహించని విధంగా ఆయన ట్వీట్ బూమరాంగ్ అయింది. నెటిజన్లు ఒక రేంజ్ లో నిన్నంతా అంబటి రాంబాబు ని ఆడుకున్నారు. కొందరు సమాధానమిస్తూ, “2015 ఆగస్టు 15 న జగన్ కూడా హైదరాబాద్ నుంచి జెండా ఎగురవేశారు, మరి మీ లాజిక్ ప్రకారం, జగన్ కి మన రాష్ట్రానికి సిఎం గా ఉండటానికి అర్హత ఉందంటారా ?” అని ప్రశ్నిస్తే, “అయ్యా అంబటి రాంబాబు గారు, అది ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదు ఆంధ్ర లో నే జరుపుకోవటానికి….. స్వాతంత్ర్య దినోత్సవం ఏ రాష్ట్రంలో ఐనా జరుపుకోవచ్చు….మీ చిల్లర రాజకీయాలు ఆపండి ఇకనైనా!” అని మరి కొందరు ఎద్దేవా చేశారు. ఇంకొందరైతే ” అవునా? మరి కరోనా ఆంధ్రా లో వొస్తే అక్కడే వైద్యం చేపించుకోవాలి కదా! మరి పక్క రాష్ట్రానికీ ఎందుకు పారిపోయారు, జాతీయ పండుగను రాష్ట్రంలో జరుపుకోలేక పోవడానికే మాట్లాడే అర్హత లేకపోతే….. అధికారంలో ఉండి, కరోనా జబ్బు చేస్తే వైద్యము చేయించుకోడానికి వేరే రాష్ట్రం వెళ్లిన పార్టీ వాళ్లకి ఏమి అర్హత ఉందో మీ విజ్ఞత కే వదిలేస్తున్నాం.” అంటూ చురకలంటించారు.

మొత్తానికి జాతీయ జెండా ఎగర వేయడాన్ని , స్వాతంత్ర దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనంగా మలుచుకుందామని ప్రయత్నించిన అంబటి రాంబాబు కి షాక్ తగిలినట్లు అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close