మీడియా వాచ్‌: ఈనాడు లో కొత్త రూల్స్‌

క‌రోనా వ‌ల్ల మీడియా రంగం మొత్తం సంక్షోభంలో ప‌డింది. ముఖ్యంగా ప్రింట్ మీడియా. తెలుగునాట అగ్ర దిన ప‌త్రిక‌గా చ‌లామ‌ణి అవుతున్న ఈనాడుకీ ఈ క‌రోనా బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే చాలామందిని ఉద్యోగాల్లోంచి తొల‌గించారు. ఇప్పుడు కూడా ఆ తొలగింపు నిరాటంకంగా సాగుతోంది. తాజాగా పేజీ డిజైన‌ర్ల‌ని ఇంటికి పంపించేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది ఈనాడు. ఒక‌ట్రెండు రోజుల్లో క‌నీసం 30 మంది పేజీ మేక‌ర్ల‌ని తొల‌గించ‌బోతోంద‌ని టాక్‌. అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఒకొక్క‌రికీ మూడు నెల‌ల జీతం ముంద‌స్తుగా చెల్లించి, రాజీనామా చేయించుకుంటున్నారు.

పేజీ మేకింగ్ ఆర్టిస్టుల‌కు మంచి జీతాలిస్తోంది ఈనాడు. అయితే క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల, జీతాల భారం త‌గ్గించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకే సిటీ టాబ్ల‌యిడ్స్ పేజీల‌ను రూపొందిస్తున్న ఆర్టిస్టుల‌ను ప‌క్క‌న పెట్టింది. కొంత‌కాలంగా జిల్లా ఎడిష‌న్లు రావ‌డం లేదు. ఆ పేజీల‌కు ప‌నిచేసే ఆర్టిస్టులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వాళ్ల‌ని ఈనాడు యాజ‌మాన్యం శాశ్వ‌తంగా తొల‌గించింది. డెస్క్‌లో ఉండి వార్త‌లు రాసే స‌బ్ ఎడిట‌ర్ల‌ను పేజీ మేకింగ్ నేర్చుకోమ‌ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో స‌బ్ ఎడిట‌ర్లు అటు వార్త‌లు రాసి, ఇటు పేజీనీ డిజైన్‌చేయాల‌న్న‌మాట‌. అలా రెండు ప‌నులూ నిర్వ‌హించ‌గ‌లిగే వాళ్ల‌కే ఉద్యోగాలు మిగులుతాయి. లేదంటే వాళ్లూ ఇంటికి వెళ్లాల్సిందే. ఈ కొత్త రూల్ తో ఈనాడు స‌బ్ ఎడిట‌ర్లు గాభ‌రా ప‌డుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు మేక్ మేకింగ్ నేర్చుకోవ‌డం, పేజీ పెట్ట‌డం ఆషామాషీ వ్య‌వ‌హారాలు కావు. కాక‌పోతే.. ఈనాడు జ‌ర్న‌లిజం స్కూల్ లో శిక్ష‌ణ ఇస్తున్న‌ప్పుడే స‌బ్ ఎటిటింగ్ స్కిల్స్ తో పాటుగా, మేజీ ఎలా పెట్టాలో కూడా నేర్పిస్తారు. ఇప్పుడు ఆ శిక్ష‌ణ అక్క‌ర‌కు రాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close