కోడికత్తి శీనుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తోంది జగన్ రెడ్డే !

జగన్ రెడ్డి సీఎం కావాలని పెద్ద స్కెచ్ వేసి తాను అనుకున్న ఎఫెక్ట్ సాధిచిన కోడికత్తి శీను ఐదేళ్లుగా జైల్లో ఉన్నారు. జగన్ రెడ్డి .. కోడికత్తి శీను ఆశించినట్లుగా బంపర్ మెజార్టీ సాధించి సీఎం అయ్యారు. కానీ శీనుకు మాత్రం చిప్పకూడే గతయింది. ఐదేళ్లుగా ఆయనకు బెయిల్ ఎందుకు రాలేదు అంటే.. జగన్ రెడ్డే రానీకుండా చేస్తున్నారని శ్రీను తరపు లాయర్ ఖరాఖండిగా చెబుతున్నారు. సీఎం జగన్ విచారణకు సహకరించాలని.. కోర్టుకు హాజరుకావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్వోసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అంటున్నారు. జగన్ NOC అయినా ఇవ్వాలి, వాదనలైనా వచ్చి వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పిందని.. రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారన్నని ఆయన అసహనం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని శ్రీను తరపు న్యాయవాది సలీం అనుమానం వ్యక్తం చేశారు. కోడికత్తి శీను తల్లిదండ్రులు జగన్ రెడ్డిని వేడుకోని సందర్భం లేదు కానీ జగన్ రెడ్డి మనసు కరగలేదు. ఆ ఘటనతో తనకు సానుభూతి తెచ్చిపెట్టడమే కాకుండా… తనకు దొంగవైద్యం చేసిన డాక్టర్లకు పదవులు కూడా ఇచ్చారు.కానీ అసలు మొత్తం ఎపిసోడ్ నడిపించిన వ్యక్తి దళితుడు, సామాన్యుడు కాబట్టి జగన్ రెడ్డి దయ చూపడం లేదంటన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బలి పశువుగా కోడికత్తి శీను వ్యవహారాన్ని వాడుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

విచారణను వేగవంతం చేసి.. కేసును ముగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శ్రీను తరపు లాయర్లు చెబుతున్నారు. కానీ జగన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి సహకారం లేకపోతే.. కేసు ముందుకు వెళ్లే అవకాశం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఉంటాయా ? ఊడుతాయా ?

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. వాటి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కాగ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close