ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. మరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి మొదటి గెజిట్ నోటిఫికేషన్ NHAI జారీ చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 9 గ్రామాల్లో మొత్తం 1,173 ఎకరాల భూమి సేకరిస్తారు. భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. భూమి సేకరణ విషయంలో రైతులకు మంచి రక్షణ ఇవ్వడానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం చట్టబద్ధమైన పరిహారం అందించనున్నారు.
లింగాపురం, ధరణికోట, ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్ పురం, కంభంపాడు, తల్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు వంటి గ్రామాల్లో ప్రస్తుతానికి భూసేకరణ జరుగుతోంది. తర్వాత, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల చివరికి ఐదు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టులో 121 గ్రామాలు, 23 మండలాలు ప్రభావితమవుతాయి.
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు 189.4 కిలోమీటర్ల పొడవుతో, ఆరు లేన్లతో ప్రతి వైపు సర్వీస్ రోడ్లతో నిర్మిస్తారు. మొత్తం వెడల్పు 140-150 మీటర్లు. ఈ రోడ్డు విజయవాడ-గుంటూరు-తెనాలి అర్బన్ క్లస్టర్తో.. ఐదు జిల్లాలను అనుసంధానం చేస్తుంది. మొత్తం ఖర్చు సుమారు 24,791 కోట్లు గా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును ‘గ్రీన్ హైవే’గా అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు 12 ప్యాకేజీలుగా విభజించారు. ఎన్హెచ్ఎఐ నే పూర్తి చేస్తుంది. 2015లో ప్రతిపాదించిబన ఈ ప్రాజెక్టు 2019 తర్వాత ఆగిపోయింది. ప్పుడు త్వరగా ముందుకు సాగుతోంది.