కొద్ది రోజులకిందట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారాల్లో వివాదాస్పదమైన ట్రావెల్ వీడియోలు చేసే సూర్యాపేటకు చెందిన భయ్యా సన్నీయాదవ్ ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. రెండు రోజుల చెన్నై ఎయిర్ పోర్టులో ఆయనను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన బైక్ పై పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొన్నారని.. అలాగే.. కొంత సమాచారం మార్పిడి చేశారన్న ఆధారాలు దొరికినట్లుగా తెలుస్తోంది.
సన్నీయాదవ్ పాకిస్తాన్ టూర్ కు కొంత మంది స్పాన్సర్లు ఉన్నారని తేలినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ లో కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన జకీర్ నాయక్ ఆన్ లైన్ ద్వారా పాకిస్తాన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ టూర్లు చేసే సన్నీయాదవ్ కు జకీర్ నాయక్ ఎవరో తెలియకుండా ఉండదు.
ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ అదపులో ఉన్నారు. ఇప్పుడు సన్నీ యాదవ్ కూడా అలాంటి కేసులోనే ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లారు. పాకిస్తాన్ టూర్లు వీరి జీవితానికి పెద్ద సమస్యలు తెచ్చి పెట్టాయి. తాము దేశద్రోహం చేస్తున్నామని వారికి తెలిసినా తెలియకపోయినా.. తప్పు మాత్రం చేసి ఉంటే.. బయటపడటం చాలా కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.