ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు : నిమ్మగడ్డ

ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని… పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఎస్‌ఈసీ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని ఎస్‌ఈసీ గుర్తు చేసింది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమై.. మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మున్సిపల్ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ఎస్‌ఈసీ ప్రకటించలేదు.

ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని.. కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని.. ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమని చెబుతున్నారు. ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.

ఎస్‌ఈసీ బాధ్యతగా.. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని … 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ చెబుతున్నారు. అయితే నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేని ఏపీ సర్కార్.. నిమ్మగడ్డ ప్రకటనపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డ పదవీ కాలం మార్చితో ముగిసిపోతుందని … ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఏపీ సర్కార్ అనుకుంటోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close