నిర్భయ కేసులో రావెల అరెస్టు, గడ్డురోజుల తప్పవ్‌!

ప్రస్తుతం మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి, వాటిని నియంత్రించడానికి అత్యంత పటిష్టంగా రూపొందిన చట్టాల్లో నిర్భయ చట్టం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు, రావెల సుశీలపై కూడా అదేకేసు నమోదు అయింది. ఒత్తిళ్లకు చివరికి ముందస్తుగా బెయిలు పొందడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో చివరికి రావెల సుశీల్‌ శనివారం అర్ధరాత్రి తర్వాత బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఆయనను, ఆయన డ్రైవర్‌ అప్పారావును కూడా పోలీసులు అరెస్టు చేసి నిర్భయ కేసు పెట్టారు.

ఈ కేసు ఊబిలోంచి రావెల సుశీల్‌ బయటపడడం అంత సులువు కాదని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆధారాలు అన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం పరంగా ఎలాంటి ఒత్తిడి చేయడానికి కూడా ఆస్కారం లేని విధంగా కేసు తయారయింది. కేసుకు సంబంధించి తెలుస్తున్న వివరాల్ని బట్టి..
తాగిన మత్తులో ఉన్న సుశీల్‌, అతని డ్రైవరు అప్పారావు కలిసి వివాహితను సుమారు కిలోమీటరు దూరం వెంబడించారు. మధ్యలో ఆమెను చేయి పట్టుకుని కారులోకి లాగడానికి కూడా సుశీల్‌ ప్రయత్నించాడు. ఆ మహిళ కాలనీ వచ్చేయడంతో ఆమె కేకలు పెట్టడం వలన భర్త సహా, జనం పోగయ్యారు. సుశీల్‌ను, డ్రైవరును చితక్కొట్టారు. అప్పుడే అక్కడకు వచ్చిన ఒక కానిస్టేబుల్‌ వారిని పోలీసు స్టేషన్లో అప్పజెపుతానంటూ జనంనుంచి విడిపించి.. తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సందుగా సుశీల్‌ తప్పించుకుని పారిపోయాడు. ఇదీ సంఘటనల క్రమంగా ఉంది.

కుక్కపిల్లను తప్పించబోయి కారు పక్కకు తీస్తే ఆ మహిళ అనవసరంగా భయపడినదంటూ.. సుశీల్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ప్రకారం.. ఈ వ్యవహారం అంత చిల్లరగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. సుమారు కిలోమీటరు దూరం ఫాలో అయిన సంగతి స్పష్టంగా సీసీ కెమెరాల పుటేజీకి చిక్కింది. కాలనీ వాళ్లంతా వచ్చి వాళ్లను చితక్కొట్టారు గనుక.. వారందరూ కూడా సాక్షులుగానే ఉంటారు. అందుకే సుశీల్‌కు గడ్డురోజులు తప్పవని అందరూ భావిస్తున్నారు. కారులో మరెవరైనా ఉన్నట్లు బనాయించడానికి కూడా కుదరకపోవచ్చు. ఎందుకంటే జనానికి చిక్కి వారిచేత దెబ్బలు తిన్న తరువాత.. వారికి తెలియకుండా మనుషుల్ని మార్చడం కుదరదు. అయితే ఇలాంటి నేరాలు ఎవరు చేసినా సరే.. శిక్ష అనుభవించి తీరాల్సిందేనని.. తన కొడుకు గనుక తాను జోక్యం చేసుకునేది ఉండదని మంత్రి రావెల కిశోర్‌బాబు సెలవిచ్చారు. అంతటి నిజాయితీ స్టేట్‌మెంట్‌ ఇచ్చినందుకైనా.. ఆయన తన కొడుకును కొన్నాళ్లు కటకటాల్లో చూసుకోవాల్సిన అగత్యం తప్పేలా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close