మోడీ ఫోటో కోసం కలెక్టర్‌తో నిర్మలాసీతారామన్ పంచాయతీ !

ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే రాజకీయ నాయకురాలే. అందుకే తనకు తెలంగాణలో కొన్ని బాధ్యతలిచ్చిన కారణంగా … ఆమె ఆ బాధ్యతలకు న్యాయం చేయడానికి గల్లీ రాజకీయ నాయకురాలి పాత్రలోకి వచ్చేశార. రెండు రోజుల నుంచి తెలంగాణలో పర్యటిస్తున్న ఆమె.. శుక్రవారం యాక్షన్‌లోకి దిగిపోయారు. ఓ రేషన్ షాపు దగ్గరకు వెళ్లారు. ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి కాబట్టి.. అధికార పర్యటన పేరుతో రాజకీయ పర్యటన చేస్తున్నా కలెక్టర్ కూడా ఆమె వెంట ఉన్నా

రు. మీడియా అటెన్షన్ కోసం ఇంత కంటే పెద్ద అవకాశం రాదనుకున్నారేమో కానీ.. కలెక్టర్‌పై సంబంధం లేని ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో రాష్ట్ర వాటా ఎంత.. కేంద్ర వాటా ఎంత అని కలెక్టర్ జితేష్ పాటిల్ ను నిలదీశారు. యూపీఎస్సీలో కూడా ఇలాంటి ప్రశ్న అడగలేదని ఆయన తికమక పడ్డారు. తెలీదని చెప్పారు. తెలంగాణలో అందిస్తున్న ఉచిత బియ్యం ఖర్చులో రూ. 29 కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 5 మాత్రమే కేటాయిస్తోంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

అంతలోనే కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీపై ప్రతి పైసా ఖర్చు చేస్తుంటే… రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవటం ఏమిటని నిలదీశారు. రేషన్ దుకాణాల్లో మోదీ ఫోటో కూడా ఉండాలని ఆయన కలెక్టర్ ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడూ ఊహించి ఉండరు. నిర్మలా సీతారామన్ అడిగిన దానికి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు.నిర్మలా సీతారామన్ వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రం నుంచి వెళ్తున్న పన్నులే తిరిగి ఇస్తున్నారని అందులోనూ తీసుకుంటున్నదే ఎక్కువ తిరిగి వస్తోంది తక్కుని అంటున్నారు. బీజేపీ నేతలు అతి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close