చైతన్య : వేటాడే ప్రభుత్వాలున్నప్పుడు సెలబ్రిటీలు నోళ్లెలా తెరుస్తారు..?

స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదుంటూ.. కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలపై… సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కానీ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికాలోని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ దగ్గర్నుంచి తమిళనాడులోని జల్లి కట్టు వరకూ టాలీవుడ్ స్టార్స్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన మాత్రమే స్పందించరు. దీనికి కారణం… ఉంది. అదే భయం. ప్రభుత్వాలు టార్గెట్ చేస్తాయనే భయం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే స్టార్లు ప్రశాంతంగా ఉండగలరా..!?

టాలీవుడ్ స్టార్స్‌ది స్పందించకుండా ఉండే రాయి లాంటి మనస్థత్వం కాదు. తమకు స్టార్లు చేసిన ప్రజల పట్ల వారికి ఎంతో కొంత అభిమానం ఉంటుంది. వారిసమస్యల్లో పాలు పంచుకోవాలని అనుకుంటారు. కానీ వారు తమ అభిప్రాయాలను బయటకు చెప్పకుండా అణగదొక్కుకుంటున్నారు. ఎందుకంటే వారికి తాము కొంత మందికి వ్యతిరేకం అవుతామనే భావన. జాతీయ.. అంతర్జాతీయ అంశాలపై స్పందించడం వేరు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై స్పందించడం వేరు. ఇక్కడ అమరావతికి మద్దకు తెలిపితే.. ప్రభుత్వానికి టార్గెట్ అవుతామనే భయం వారికి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపితే.. కేంద్రానికి టార్గెట్ అవుతామన్న ఆందోళన కూడా ఉంటుంది. అందుకే వారు స్పందించలేకపోతున్నారు.

కులాల వారీగా చీలిపోయిన ప్రజల కోసం రిస్క్ ఎందుకని స్టార్లు అనుకుంటున్నారా..?

ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు వ్యతిరేకంగా ఎవరైనా సెలబ్రిటీలు మాట్లాడితే వారిని వెంటాడుతున్న ఘటనలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన బాలీవుడ్ సెలబ్రిటీలపై ఐటీ దాడులు జరిపి మీడియాలో చేసిన అతి ప్రచారం అంతా ఇంతా కాదు. అలాంటి పరిస్థితులు మాకెందకని టాలీవుడ్ ప్రముఖులు సైలెంట్ గా ఉంటున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇదితెలిసి కూడా.. రైతుల గురించి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారని.. అయితే రైతు సమస్యలపై సైలెంటయ్యారని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమంపైనా అదే పరిస్థితి. రేపు ప్రభుత్వాల నుంచి ఏదైనా కష్టం వస్తే ప్రజలు అండగా ఉండే పరిస్థితిలేదు. కులమతాల ఆధారంగా చీలిపోయిన సమాజం.. ఐక్యతను ఎప్పుడో దూరం చేసింది.అందుకే స్టార్లు కూడా.. తమ జాగ్రత్తను తాము చూసుకుంటున్నారు.

స్పందించలేదని స్టార్లను నిందించడం సరి కాదు..! అది వారిష్టం..!

ప్రభుత్వాలకు భయపడి సైలెంట్‌గా ఉండటం అనేది ఇతర సినీ పరిశ్రమల్లో స్టార్లు చేయరు. తమిళనాడులో విజయ్ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా గళమెత్తుతూనే ఉంటారు. అందుకే ఆయనను దళపతిగా ఫ్యాన్స్ పిలుస్తూంటారు. ఇప్పుడు ఇమేజ్ అనేది.. సినిమాల్లో చేసే పాత్రల ద్వారానే కాదు.. నిజ జీవితంలో ప్రజలకు అండగా నిలబడే శైలిని బట్టి కూడా వస్తోంది. అయితే రాజకీయ ఆకాంక్షలు ఉన్న వారు మాత్రమే.. ఇప్పుడు బయట పడుతున్నారు. రాజకీయాల్లో ఉన్న స్టార్లు.. రాజకీయాల్లోకి రావాలనుకున్న స్టార్లు మాత్రమే.. స్పందిస్తున్నారు. దాని వల్ల.. ప్రయోజనం ఉండటం లేదు. స్పందించని సెలబ్రిటీలు విమర్శలకు గురవుతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close