పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఇంకా ఏదో ఆశించారు కానీ.. ఇప్పటి వారి ఆశలు ఆడియాశలుగానే ఉండిపోతున్నాయి. కరోనా కారణం చెప్పి.. రెండు నెలల పాటు సగం…సగం జీతాలు కోత వేయడమే కాదు.. ఇవ్వాల్సిన డీఏలన్నీ పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు వాటి కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఇక పీఆర్సీ గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. అసలు డీఏలే ప్రభుత్వం ఇవ్వడంలేదు.. ఇక పీఆర్సీ ఇస్తుందా అని ఉద్యోగాలు నిట్టూరుస్తున్నారు.

పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం జీతం బకాయిలు చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఎప్పుడెప్పుడు చెల్లిస్తామో కూడా చెప్పింది. ఓ డీఏ కూడా ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఏపీలో మాత్రం ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం… టీ , కాఫీలు ఇచ్చి బుజ్జగిస్తోంది. వచ్చే రెండు నెలల్లో బకాయిలు చేల్లిస్తామని.. ఓ డీఏ కూడా ఇస్తామని బేరాలు ఆడుతోంది. ఈ బేరాలు ఉద్యోగ సంఘాల నేతల్ని నిస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరిస్తోందేమిటని మథనపడుతున్నారు.

ఉద్యోగ సంఘాల నేతల్లో ఎక్కువ మంది ప్రభుత్వానికి సరెండర్ అయినట్లుగా మాట్లాడుతూండటంతో.. ఏం చేయాలో ఇతర ఉద్యోగులకు అర్థం కావడం లేదు. దసరా పండుగకు అయినా జీతం బకాయిలు ఇప్పిస్తారేమోనని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. అదే సమయంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. వారిని బుజ్జగించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నించకపోగా… గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని ఇప్పుడు నిధుల్లేవన్న కారణాలు చెబుతూ.. లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close