రామ్‌మాధవ్, మురళీలకు ఎంపీ సీట్లే లేవు..! ఇక మంత్రిపదవులా..?

భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తాము గెలుచుకోగలిగిన ఎనిమిది సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి రాజ్యసభకు ఎవరెవరు వెళ్లబోతున్నారన్నదానిపై విస్తృతమైన చర్చ ఢిల్లీలో జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారి కన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కబోతోందన్న ప్రచారమే ఉద్ధృతంగా సాగింది. దానికి కారణం ఇటీవల పార్టీ పదవుల నుంచి ఉద్వాసనకు గురైన రామ్‌మాధవ్, మురళీధర్ రావు లాంటి వారితో పాటు… రాజ్యసభ హామీతో ఆ పార్టీలో చేరిన గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్లు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రామ్‌మాధవ్, మురళీధర్ రావులను కేబినెట్‌లోకి తీసుకుంటారని.. వారిని పార్టీ పదవుల నుంచి గెంటేసిన సమయంలో బీజేపీ వైపు నుంచి ప్రచారం జరిగింది.

ఆ దిశగా ఈ ముగ్గురిలో ఒకరుయూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఖాయమనుకున్నారు. ఓ దశలో.. గరికపాటి మోహన్ రావు పేరు ఖరారయిందని కూడా చెప్పుకున్నారు. కానీ.. లిస్ట్ రిలీజయిన తర్వాత.. ఎవరిలోనూ ఉత్సాహం లేకుండా పోయింది. ఎవరికీ … యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని బీజేపీ హైకమాండ్‌ కల్పించలేదు. గతంలో జీవీఎల్ నరసింహారావును యూపీ కోటా నుంచే రాజ్యసభకు పంపారు. అలాగే అవకాశం ఇస్తుందని భావించారు. అయితే.. త్వరలో జరగనున్న యూపీ ఎన్నికలపైనే ఎక్కువగా బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. సామాజిక సమీకరణాలన్నింటినీ కవర్ చేసుకుని.. తమ పార్టీకి ఆయువు పట్టుగా ఉంటున్న బ్రాహ్మణ సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది. కేంద్రమంత్రి హర్దిప్ పురికి సీటిచ్చింది. తెలుగు వారికి నిరాశే ఎదురయింది. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో… రామ్ మాధవ్, మురళీధర్ రావుల్లో ఎవరికీ చోటు ఉండకపోవచ్చని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

అయితే.. కర్ణాటకలో ఓ రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. సిట్టింగ్ ఎంపీ కరోనాతో చనిపోయారు. కానీ.. కర్ణాటకలో కూడా లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ తెలుగు వారికి చాన్సిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇక తెలుగువారికి రాజ్యసభ సీట్లు.. మంత్రి పదవులు ఇప్పుడల్లా అందవని అర్థమవుతోంది. రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే.. తెలుగువారు బీజేపీ హైకమాండ్‌కు గుర్తుకు వస్తారని నిష్టూరాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close