జ్ఞాపకానికే గాంధీ గొప్ప..! ఎవరికీ పట్టని మహాత్ముని బాట ..!

ఉదయం మహాత్ముని స్మరణతో నిద్రలేచింది దేశం. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ అందరూ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి నివాళులర్పిస్తున్నారు. ప్రోఫైల్‌ పిక్స్‌లు మార్చేసుకున్నారు. ఆయన సిద్ధాంతాలు ఎంత గొప్పవో.. తమకు తెలిసిన భాషల్లో వ్యక్తీకరిస్తున్నారు. ఆయన ఎందుకు మహాత్ముడయ్యారో.. విశ్లేషిస్తున్నారు. ప్రధాన పత్రికలు.. ఆయన గురించి పేజీలకు పేజీలు కొత్త.. కొత్తగా రాశాయి. కానీ.. ఇలా చెబుతున్న వారిలో … మహాత్ముని గురించి గొప్పగా చెబుతున్న వారిలో.. ఆయన సిద్ధాంతాలు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టాయని వాదిస్తున్న వారిలో… కొందరంటే.. కొందరైనా.. వాటిని పాటించే ప్రయత్నం చేస్తున్నారా..? అంటే.. ఒక్కరైనా.. గుండెల మీద చేయి వేసుకుని గాంధీబాటన పయనిస్తున్నాం.. అని చెప్పే పరిస్థితి లేదు.

మహాత్ముని జ్ఞాపకాల్లో దేశం..! మనస్ఫూర్తిగానేనా..?

అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన గాంధీ.. అద్భుతాలే చేశారు. ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపమన్న ఆయన సిద్ధాంతమే … స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది. బ్రిటిషన్ల మనసుల్లో మార్పు తెప్పించి.. ఆయన స్వాతంత్ర్యం తెప్పించారు. అప్పట్లో.. ఆయన విధానాలను వ్యతిరేకించిన వారున్నారు. బుల్లెట్‌ను బుల్లెట్‌తోనే తీయాలన్న సిద్ధాంతాన్ని అమలు చేయాలని వాదించిన వారున్నారు. వారందరూ.. చివరికి హింసతో సాధించేదేమీ లేదని రియలైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు.. అందరిదీ ఒకటే బాట. హింసతోనే ఏదైనా సాధ్యమని నమ్ముతున్నారు. దేశం మొత్తం ఏకతాటిపైకి ఉండాలన్నది మహాత్ముని కల. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు… కుల, మత, ప్రాంతాల ఆధారంగా.. ప్రజలను నిట్ట నిలువుగా చీల్చేసి.. దేశంలోనే ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టేస్తున్నారు. ఫలితంగా.. గాంధీ కలలుకన్నా భారత్.. ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఆవిష్కృతం కాలేదు.

గాడ్సేకు పొడిగిన వాళ్లకు మద్దతెలా లభించింది…?

గాంధీ మహాత్ముడ్ని గాడ్సే చంపేశాడు. ఆ గాడ్సేని… తర్వాత ఉరి తీశారు. కానీ ఆ గాడ్సే భావజాలాన్ని మాత్రం అంతం చేయలేకపోయారు. స్వాతంత్రం వచ్చి… గాంధీ మహాత్ముడు ప్రాణ త్యాగం చేసిన డెబ్భై ఏళ్ల తర్వాత.. ఆ భావజాలం ఇప్పుడు.. ఇంతింతే వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. గాడ్సేను మహాత్ముడిగా పూజించేవారు పెరిగిపోవడమే దీనికి నిదర్శనం. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ..ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అనే నేత.. మహాత్ముడ్ని చంపడం.. గాడ్సే చేసిన మంచి పని అన్నట్లుగా మాట్లాడారు. ఆమె మాటలు దేశ ప్రజల్ని షాక్‌కు గురి చేస్తే… కొంత మందికి మాత్రం ఉత్సాహాన్నిచ్చాయి. చరిత్ర గురించి.. గాంధీ పోరాటం గురించి ఏ మాత్రం తెలియని వాళ్లు.. ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. గాడ్సేకు అనుకూలంగా ప్రకటన చేశారు. అక్కడే దేశంలో స్పష్టమైన విభజన లేఖ కనిపించినట్లయింది. ఈ భావజాలాన్ని తుంచి వేయడం అంత సాధ్యం కాదు.

ప్రజల మధ్య విభజన తీసుకురాకపోవడమే ఆయనకు అసలైన నివాళి..!

గాంధీ జయంతి రోజు.. ఆయనను గొప్పగా గుర్తు చేసుకుంటున్నారు. ఒక పండుగలా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ప్రోఫైల్ పిక్‌లు మార్చడం… గాంధీకి నివాళి అర్పించడం కాదు. దేశాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడం ముఖ్యం. దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులు. దేశంలో ప్రజలందరి మధ్య ఏకతాభావం వచ్చేలా వ్యవహరించడమే గాంధీకి నివాళి. కుల, మత, ప్రాంత వర్గ బేధాలతో ఒకరికొకరు దూరమైపోవడం.. గాంధీ సిద్ధాంతం కాదు. రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం.. ఈ విద్వేషాలు పెంచుతున్నాయి. అయినా వారు గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా అనుసరించిన రోజే.. ఆయనకు నిజమైన.. ఘనమైన నివాళి అర్పించినట్లు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close