నైతిక విజయం కాదు.. అసలు గెలుపు బీజేపీదే..!

గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పరంగా టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్‌ఎస్‌ 55 డివిజన్లలో విజయం సాధిస్తే.. బీజేపీ 48 స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసింది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. కానీ, అభ్యర్థి మెజారిటీ కంటే స్టాంపు ఓట్లు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఫలితాన్ని నిలిపి వేశారు. గెలుపొందిన సీట్ల లెక్కన టీఆర్‌ఎస్సే ముందంజలో ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కలో మాత్రం కమలం విజయం సాధించింది. బీజేపీకి అత్యధికంగా 12,13,900 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇది మొత్తం 31.43 శాతం.

టీఆర్‌ఎస్‌కు 11,89,250 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది 30.79 శాతం. 2016లో బీజేపీకి వచ్చిన ఓట్లు 3,46,253 మాత్రేమ. ఈ సారి ఎనిమిదిన్నర లక్షల ఓట్లు అధికంగా పొందింది. గత ఎన్నికలతో పోలిస్తే 2.79 లక్షల ఓట్లను టీఆర్‌ఎస్‌ కోల్పోయింది. భారత ప్రజాస్వామ్యం మెజార్టీ మీద ఆధారపడి ఉంది.సీట్ల మెజార్టీలో అసెంబ్లీలలో లెక్కలు తేలుస్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ లెక్కల ఓట్ల మెజార్టీలో బీజేపీ అనూహ్యమైన ఎదుగుదల నమోదు చేసింది. అధికార పార్టీ కన్నా అత్యధికంగా ఓట్లు సాధించడం అంటే.. మామూలు విషయం కాదు. ఈ విషయంలో భారతీయజనతా పార్టీ విజయం సాధించించింది.

భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ముద్ర వేయడానికి అవసరమైన బలాన్ని సంపాదించుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తరచూ ఓ మాట చెబుతూ ఉంటారు… నైతిక విజయం తమదేనని అంటూ ఉంటారు. ఇక్కడ… గ్రేటర్‌లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. అది ఓటమి కాదు.. నైతిక విజయంకూడా కాదు.. అసలైన విజయమేనని… వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. గ్రేటర్ లో అత్యధిక ప్రజలు కావాలని కోరుకున్నది బీజేపీని.ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close