ప్రముఖ రచయిత్రి నాయిని కృష్ణ కుమారి మృతి

ప్రముఖ రచయిత్రి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్సిలర్ నాయిని కృష్ణ కుమారి నిన్న రాత్రి మరణించారు. ఆమె గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు.

ఆమె మార్చి14,1930న గుంటూరులో జన్మించారు.ఆమె ప్రముఖ లాయర్ కనకపల్లి మధుసూదన రావుగారి ఆర్ధాంగి. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.

ఆమె 1951లో మద్రాస్ విమెన్స్ కాలేజీలో లెక్చరర్ గా తన అధ్యాపక జీవితం ప్రారంభించారు. మరుసటి సంవత్సరమే ఆమె ఉస్మానియా యూనివర్సిటీలోని విమెన్స్ కాలేజీకి వచ్చేసారు. అక్కడే ఆమె చాలా కాలం వరకు ప్రొఫెస్సర్ గా పనిచేసారు. 1983-84 సం.లలో ఆమె తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీకి ప్రిన్సిపుల్ గా పనిచేసారు. మళ్ళీ ఉస్మానియాకి తిరిగి వచ్చి తెలుగు విభాగానికి అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ కి అధ్యక్షురాలిగా పనిచేసి 1990 సం.లో పదవీ విరమణ చేసారు. తరువాత 1996 నుండి 99 వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ గా పనిచేసారు.

కనుమరుగవుతున్న తెలుగు జానపద సాహిత్యాన్ని నాయిని కృష్ణ కుమారి వెలుగులోకి తెచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే ఆమె ‘తెలుగు జానపద విజ్ఞానం: సమాజం, సంస్కృతి, సాహిత్యం’ అనే ఒక అద్భుతమయిన గ్రంధాన్ని రచించారు. జానపద సాహిత్యానికి సంబంధించినంత వరకు అదొక డిక్షనరీ అని చెప్పవచ్చును. ఆమె గణితశాస్త్రంలో కూడా అపూర్వమయిన ప్రతిభ కనబరిచారు. అగ్నిపుత్రి, ఏం చెప్పం నేస్తం, గౌతమి, అపరాజిత నవలలు, ఆయత కధల సంపుటి, ఆంధ్రుల కధ, మనమూ మన పూర్వులు, తెలుగు బాష చరిత్ర, తెలుగు జానపద గేయ గాధలు, పరిశీలన, పరిశోధన, కాశ్మీర దీపకళిక వంటి చారిత్రిక, బాష, పరిశోధన, పర్యాటక గ్రంధాలు ఆమె ప్రతిభకు అద్దం పడతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close