తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సందడి

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెల మొదటి వారంతో రెండు రాష్ట్రాల నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో నాలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి కాగా, తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 50 స్థానాలు ఖాళీ అవుతాయని, వాటికి మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహమ్మద్ అలీ ఖాన్, కే.కేశవరావు, టి.సుబ్బిరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి కే.వీ.పీ. రామచంద్ర రావు, గరికపాటి మోహన్ రావుల పదవులు ఖాళీ అవుతాయి.

సమైక్య రాష్ట్రం విడిపోక ముందు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కేశవరావు, కే.వీ.పీ. రామచంద్ర రావులను రాష్ట్రం విడిపోయిన తరువాత చెరో రాష్ట్రానికి కేటాయించారు. ఎక్కడ ఎలాంటి తప్పిదమో.. ఏ నిబంధనలో కానీ తెలంగాణకు చెందిన కేశవరావు ఆంధ్రప్రదేశ్ కోటాలను, ఏపీకి చెందిన కే.వీ.పీ.రామచంద్ర రావు తెలంగాణ కోటా లోనూ సభ్యులుగా ఉన్నారు. ఇది అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ పదవీ విరమణ చేస్తున్న సమయంలో ఈ రెండూ ఖాళీలను ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకుల తోటే భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.

తెలంగాణలోనూ అధికార పార్టీకే రెండు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలోనూ రాజ్యసభ టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాల్లోనూ మైనారిటీ, బీసీ, దళిత వర్గాలకు మూడు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది అంటున్నారు. ఇందులో ఒక స్థానాన్ని మహిళకు కట్ట పెట్టవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని పాలన సాగిస్తున్నారని వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ స్థానాన్ని కూడా మహిళతో భర్తీ చేస్తే ఆ సామాజికవర్గంతో పాటు ఆ వర్గానికి చెందిన మహిళలను కూడా శాంతింప చేయవచ్చునని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అగ్రవర్ణానికి, మరొకటి మైనారిటీ లేదా మహిళకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కి అప్పగించినట్లుగా తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ సీనియర్లు సహా రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న వారంతా కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆయన దయాదాక్షిణ్యాలు ఎవరిపై ఉంటాయో వేచి చూడాల్సిందే…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close