కాల‌ర్ ఎత్తుకొనే సినిమా ఇది: ఎన్టీఆర్‌

క‌ల్యాణ్ రామ్ న‌టిస్తూ, నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘బింబిసార‌’. ఆగ‌స్టు 5న రాబోతోంది. ఈ సినిమాపై క‌ల్యాణ్‌రామ్ చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ఈసారి ష్యూర్ షాట్ హిట్ అంటున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే మాట చెప్పాడు. ఈరోజు జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆల్రెడీ ఈ సినిమా చూసేసిన ఎన్టీఆర్‌… ఇప్పుడు రివ్యూ కూడా ఇచ్చేశాడు. ”అదృష్ట‌వ‌శాత్తూ ఈ సినిమా నేను ముందే చూశా. ద‌ర్శ‌కుడు క‌థ‌ని ఎంత క‌సిగా చెప్పాడో, అంత‌కంటే గొప్ప‌గా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా చూసి అభిమానులంతా కాల‌ర్ ఎగ‌రేస్తారు. క‌ల్యాణ్ రామ్ అన్న కెరీర్‌ని బింబిసార‌కు ముందు ఆ త‌ర‌వాత అని చెప్పుకొంటారు. ఈ పాత్ర కోసం అన్న‌య్య ర‌క్తం ధార‌బోశాడు. బింబిసార పాత్ర‌ని అన్న‌య్య త‌ప్ప మ‌రే న‌టుడూ చేయ‌లేడు..” అంటూ కితాబు ఇచ్చాడు. జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదని చాలా మంది చెబుతున్నార‌ని, అయితే తాను ఆ మాట న‌మ్మ‌న‌ని, మంచి సినిమా తీస్తే…. జ‌నాలు త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని బింబిసార అలాంటి సినిమానే అని ఎన్టీఆర్ చెప్పాడు. ఆగ‌స్టు 5న విడుద‌ల బింబిసార‌తో పాటుగా విడుద‌ల అవుతున్న ‘సీతారామం’ చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని, తెలుగు సినిమాని ముందుకు న‌డిపించాల‌ని ఎన్టీఆర్ కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close