మీడియా వాచ్ : ఎన్టీవీ పరువు తీసిన నాగబాబు !

ఏపీలో సాక్షి మీడియా క్లోన్ చానల్స్ గా పేరు తెచ్చుకున్నాయి టీవీ 9 , ఎన్టీవీ.. ఈ రెండింటి పని… ప్రతిపక్షంపై యుద్ధం చేయడమే. అధికార పక్షానికి బాకా ఊదడమే. అయితే ఇందు కోసం న్యూస్ ఫేక్ చేసే స్థాయికి దిగజారిపోవడమే ఇప్పుడు తెలుగు మీడియాలో అత్యంత బాధాకమైన విషయం. దీనికి తాజా ఉదాహరణ నాగబాబు విషయంలో.. ఎన్టీవీ చేసింది. దీంతో ఎన్టీవీ వైపు అందరూ అదోలా చూసే పరిస్థితి ఏర్పడింది.

పొత్తులపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని… పొత్తులు ఫైనల్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారనేది నిర్ణయం తీసుకుంటామని కర్నూలు పర్యటనలో నాగబాబు మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎన్టీవీ ప్రతినిధికి కూడా అదే చెప్పారు. కానీ ఎన్టీవీ ప్రతినిధి పొత్తులు లేకుండా ఒంటరిగా 175 స్థానాలు పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించేసింది. ఆన్ లైన్‌లోనే కాదు.. ఆఫ్ లైన్ … లైవ్ లో కూడా అదే చెప్పింది. ఒక్కచోట ఏదో తప్పు జరిగిందో అనుకోవచ్చు.. కానీ పదే పదే అదే ప్రచారం చేసింది. దీంతో సహజంగానే నాగబాబు అలా అన్నారా అని అందరూ ఆరా తీశారు. ఈ వ్యవహారం జనసేన వర్గాల్లోనూ కలకలం రేపింది.

అసలు నాగబాబు ఏమన్నారో తెలిసిన తర్వాత.. అందరు ఎన్టీవీ విషయంలో.. ఎంతకు తెగించార్రా అనుకోవడం కామన్ అయిపోయింది. ఇదే విషయాన్ని నాగబాబు కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు తానేమన్నారు.. ఎన్టీవీ ఏం చెప్పిందో .. టూ విండో వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీవీ పరువు మరింత గంగలో కలిసిపోయినట్లయింది.

ఎన్టీవీకి వైసీపీ దగ్గరే. ఆ చానల్ కు ఏపీలో విపక్షాలు కలిసి పోటీ చేయకూడదని.. జగన్ మళ్లీ గెలవాలని ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. సాక్షికి కూడా అలాగే ఉంటుంది. టీవీ9కికూడా అలాగే ఉంటుంది . కానీ ఇలా ఫేక్ చేసి.. ఏదో రాజకీయ ట్విస్టులు ఇవ్వాలనుకుంటే.. ముందుగా పోయేది మీడియా సంస్థ పరువే. ఇప్పటికే అది చాలా వరకూ గంగలో కలిసిపోయింది. నాగబాబు ఇష్యూతో మరింతగా పోయింది. ఇప్పుడు మాది ప్రతిక్షణం ప్రజాహితం అని చెప్పుకుంటే.. కామెడీ అయిపోయేలా ఆ చానల్ తీరు మారిపోయిందని కామెంట్స్ సహజంగానే వస్తూంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close