కేంద్రం క్లారిటీ : ఏపీ రాజధాని అమరావతి !

ఏపీ రాజధాని అమరావతేనని మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఓ ఎంపీ రాష్ట్రాల రాజధానులపై అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని స్పష్టం చేసింది. నిజానికి ఏపీ రాజధాని అమరావతే. అందులే ఎలాంటి డౌట్స్ లేవు. కేంద్రం నోటిఫై చేసింది. కానీ తాము మూడు రాజధానులు పెడతామని.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని.. అదొక్కటే రాజధాని అని.. వైసీపీ ప్రచారం చేస్తోంది. కానీ చట్ట పరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను ఎంచుకుంటోంది.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసం అంటూ అక్కడ ఐదు వందల కోట్లతో క్యాంప్ ఆఫీసు కట్టుకుని అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కోర్టు కేసుల కారణంగా ఆలస్యమవుతోంది. ఆయన రాజధాని కారణంగానే వెళ్తున్నారని బయట ప్రచారం చేస్తున్నారు కానీ.. వర్క్ రీలోకేషన్ అని కూడా అధికారికంగా చెప్పే ధైర్యం లేకుండా పోయింది. అదీ కూడా వెళ్లలేకపోతున్నారు. గతంలో కేంద్రం కొంత సంశయంగా అమరావతి రాజధాని అని చెప్పడానికి ప్రయత్నించేది. కానీ ఇప్పుడు మాత్రం నేరుగానే సమాధానం ఇస్తోంది.

రాజధానిగా అమరావతిని మార్చడం అేది న్యాయపరంగా సాధ్యం కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయినా జగన్ రెడ్డి ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖకు వెళ్లి ఏదో చేస్తున్నానని ప్రజలు అనుకోవాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే విశాఖ ప్రజల్లోనూ జగన్ విశాఖ రాకపోతే బాగుండన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close