దిల్‌రాజు కాంపౌండ్‌లో మరో స్క్రిప్ట్ రెడీ

కథానాయకులు ఎవరనేది చెప్పలేదు కానీ… కథ మాత్రం సిద్ధం చేసేశారు! దిల్‌రాజు కాంపౌండ్‌లో మరో స్క్రిప్ట్ సిద్ధమైంది. స్క్రీన్ప్లేతో సహా! ‘సమ్మోహనం’తో సమీక్షకులను, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన దర్శకత్వంలో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ ఇంద్రగంటి పూర్తి చేశారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన కథపై వర్క్‌ చేశారు. స్క్రీన్ప్లేని 20 రోజుల్లో పూర్తి చేసేశార్ట! యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు చోటుంది. వాళ్లు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మోహనకృష్ణ ఇంద్రగంటి స్వహస్తాలతో 250 పేజీల స్క్రీన్ ప్లే రాశారు. ఫెయిర్‌ చేస్తే… 160 పేజీలకు వస్తుందట! ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘హలో గురు ప్రేమ కోసమే’ విడుదల తర్వాత బయటకు వస్తాయేమో!! దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ని ప్రొడక్షన్‌ హౌస్‌ అనడం కంటే ప్రొడక్షన్‌ ఫ్యాక్టరీ అంటే సబబుగా ఉంటుందేమో! ఒకట్రెండు కాదు, యేడాదికి ఐదారు సినిమాలు నిర్మిస్తున్నారు మరి! గతేడాది దిల్‌రాజు కాంపౌండ్‌ నుంచి ఆరు సినిమాలోచ్చాయి. ఈ యేడాది ఆల్రెడీ రెండు వచ్చాయి. మరొకటి (హలో గురు ప్రేమ కోసమే) దసరాకు విడుదల కానుంది. ఇంకొకటి (ఎఫ్‌2) సెట్స్‌ మీదుంది! ఇంకొందరు దర్శకులు కథలు రాస్తున్నారు. కథలపై వర్క్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close