బీజేపీకి ఉన్నది 20 మంది అభ్యర్థులే !

తెలంగాణ బీజేపీ టిక్కెట్ల ఖరారుకు ప్రక్రియ ప్రారంభించింది. ఎప్పుడూ లేని విధంగా అప్లికేషన్లు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లుగా అప్లికేషన్ కు ధర నిర్ణయించలేదు. అయినా పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. పొటెన్షియల్ లీడర్లు ఎవరూ దరఖాస్తు చేయడం లేదు. తమకు కాక ఎవరికి ఇస్తారన్నట్లుగా వారి తీరు ఉంది. నిజానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాక ముందే బీజేపీ నాయకత్వం అభ్యర్థులపై కసరత్తు జరిపింది. కానీ గట్టిగా ఇరవై స్థానాలకు మాత్రమే.. అభ్యర్థులు కనిపించారు. మిగతా చోట్ల ఎవరిని దింపాలో అన్నది మాత్రం అర్థం కావడం లేదు.

కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి , బండి సంజయ్, రఘునందన్ వంటి బీజేపీ నేతలతో పాటు ఈటల, కోమటిరెడ్డి వంటి వలస నేతలందర్నీ లెక్కలేసుకుంటే ఇరవై స్థానాల్లో కాస్త బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టగలమని బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. మరి మిగతా చోట్ల పరిస్థితి ఏమిటన్నది వారికి అర్థం కావడంలేదు. ఇతర పార్టీల నుంచి వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ వస్తారన్న సూచనలు కనిపించడం లేదు. అలా అని ఆయా నియోజకవర్గాల్లో పోటీ లేదని కాదు. బీఫాం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే… ఆ బీఫాంతో గెలవమని తెలిసిన తర్వాత చాలా చేయవచ్చు మరి.

బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ లో చేరే వలస నేతలపై ఓ క్లారిటీ వచ్చింది. దీంతో ఆ పార్టీ కూడా గట్టి నమ్మకంతోనే ఉంది. కానీ బీజేపీ పరిస్థితే అటూ ఇటూ కాకుండా ఉంది . ఆ రెండు పార్టీల నుంచి వచ్చే వారికి సీట్లివ్వడం కోసం ఎదురు చూస్తోంది. అందుకే బీజేపీ సీట్ల ఖరారు నామినేషన్ల చివరి వరకూ ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్...

టీడీపీ, జనసేన క్యాడర్ సమన్వయ బాధ్యతలు తీసుకున్న నాగబాబు

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు....

లండన్‌లో జగన్ రెడ్డి ఫ్యామిలీకీ ఏపీ ప్రజల ఖర్చుతోనే సెక్యూరిటీ

ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన...

లింగుస్వామికి ఓ హీరో కావాలి

‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్‌’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close