జగన్ భయపెడుతున్నారా..? భయపడుతున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌లో తమకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం లేదన్న కారణంగా రెండు టీవీచానళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిలిపి వేయించిన వ్యవహారం.. రకరకాల రాజకీయ చర్చలకు కారణం అవుతోంది ఆయన ఫ్యాక్షన్ మనస్థత్వంతో అందర్నీ బెదిరించాలనుకుంటున్నారని కొంత మంది అంటూంటే.. టీడీపీ నేతలు మాత్రం… ఆయన భయమేమిటో స్పష్టంగా తెలుస్తోందని వెటకారం చేస్తున్నారు. సీఎం గారి ఆదేశం అంటూ.. ఇద్దరు మంత్రులు.. కేబుల్ ఆపరేటర్లను పిలిపించి… చానల్‌ను నిలిపివేయాలని హెచ్చరించారు. కాదూకూడదంటే..ఏం జరుగుతుందో చెప్పి పంపించారు. అంతగా ప్రభుత్వం… ఇన్వాల్వ్ కావాల్సినంతగా… ఆ టీవీ చానళ్లు ఇప్పుడేం చేశాయో చాలా మందికి అర్థం కావడం లేదు.

నిర్బంధాలు విధిస్తూ జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమపై ప్రజల్లో మూడు నెలల్లోనే చెప్పుకోలేనంత వ్యతిరేకత ఏర్పడిందనే భావనను ప్రజల్లో.. స్వయంగా జగనే కల్పిస్తున్నారని.. వైసీపీ నేతలు ఆందోళన కల్పిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీడియాను బ్యాన్ చేయాల్సిన అవసరం.. బలవంతంగా.. టీవీ చానళ్లను రాకుండా చేయడానికి బెదిరింపులకు పాల్పడాల్సినంత అవసరం ఏమిటన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. చలో ఆత్మకూర్ కార్యక్రమం విషయంలో చేసిన తప్పులే… మళ్లీ మళ్లీ చేస్తున్నారనే భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

చలో ఆత్మకూరు పై ఉక్కుపాదమే ఓ మైనస్..!

చలో ఆత్మకూరు కార్యక్రమంతో ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే పెద్దలకు కంటగింపుగా మారినట్లుగా ఉంది. తాము చేసిన దాని వల్లే వ్యతిరేకత వచ్చిదంని.. మీడియా చూపించడం వల్ల కాదని తెలుసుకోలేని అధికారమత్తులో… ఆ వార్తలను ప్రసారం చేశారన్న కారణంగా… ఏబీఎన్ పై తమ ప్రతాపం చూపించారు. నిజానికి చలో ఆత్మకూరు కార్యక్రమం జాతీయ మీడియాలో కూడా హైలెట్ అయింది. అలా అవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలే కారణం. ఆ నిర్బంధాల వల్లే.. జాతీయ మీడియాలోనూ హైలెట్ అయింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వంఈ సారి ఏకంగా మీడియాపైన నిర్బంధానికి పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

చూపించినందుకు మీడియాపైనా నిషేధమా..?

జగన్ మీడియాను భయపెట్టి.. ప్రజలకు అసలేం జరుగుతుందో తెలియకుండా చేద్దామని అనుకుంటున్నారని.. కానీ ప్రస్తుత డిజిటల్ విప్లవకాలంలో అదెలా సాధ్యమన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ భయ పెడుతున్నారో.. భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. స్వయంగా… తప్పు మీద తప్పు చేస్తున్నారనే అంచనాకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు… అప్రజాస్వామికంగా ఉన్న తీరు.. జాతీయ మీడియాను సైతం నివ్వెర పరుస్తోంది. రాజకీయాలకు అర్థం.. పరమార్థం.. ప్రజలకు మేలు చేయడం కాకపోవచ్చేమో కానీ…కీడు మాత్రం చేయకూడదు. కానీ ఏపీలో సర్కార్ అదే చేస్తోందని.. ప్రసిద్ధ జాతీయ ఇంగ్లిష్ పత్రికలు.. ఏకంగా ఎడిటోరియల్స్ రాసే పరిస్థితి వచ్చింది. అధికార మత్తును.. దింపేసి.. జగన్ వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసుకోకపోతే… పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. భయపెట్టడం సంగతేమో కానీ.. భయపడుతున్నారనే భావన పెరిగిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close