అసెంబ్లీలో హైడ్రామా

తెలంగాణ అసెంబ్లీలో చాలా కాలం త‌ర్వాత అనూహ్య స‌న్నివేశం క‌నిపించింది. స‌భ‌లో హైడ్రామా కొన‌సాగింది. వాయిదా అనంత‌రం కూడా స‌భ‌లోనే బైఠాయించిన ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపించాల్సి వ‌చ్చింది. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పై చ‌ర్చ త‌ర్వాత ఈ ప‌రిణామాలు జ‌రిగాయి.

విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అంశంపై ఇవాళ స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ప్ర‌భుత్వ వైఖ‌రిని విమ‌ర్శించారు. కాలేజీల‌కు ఫీజులు చెల్లించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అస‌లు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారా లేదా అని నిల‌దీశారు. ప్ర‌భుత్వం విద్యార్థుల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతోంద‌ని ఆరోపించారు.

ఈ అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ త‌ర్వాత స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం స‌భ్యులు నిర‌స‌న తెలిపారు. సీఎం స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేద‌న్నారు. తాము వివ‌ర‌ణ అడ‌గ‌టానికి అవ‌కాశం ఇవ్వ‌కుండా స‌భను వాయిదా వేశార‌ని నిర‌స‌న తెలిపారు. స‌భ‌లోనే బైఠాయించారు.

దీంతో అసెంబ్లీ కార్య‌ద్శి స‌దారాం సీఎల్పీ నేత జానారెడ్డిని క‌లిశారు. నిర‌స‌న విర‌మించాల‌ని కోరారు. అయినా జానారెడ్డి స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒప్పుకోలేదు. అధికార ప‌క్ష వైఖ‌రికి నిర‌స‌నగా స‌భ‌లోనే ఉంటామ‌ని తేల్చి చెప్పారు. దీంతో వారిని బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపాలంటూ స్పీక‌ర్ ఆదేశించారు. దీంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులను పోలీసులు బ‌ల‌ప్ర‌యోగంతో బ‌య‌ట‌కు పంపారు. కాంగ్రెస్ స‌భ్యుల‌ను గాంధీ భ‌వ‌న్ ద‌గ్గ‌ర వ‌దిలిపెట్టారు. టీడీపీ స‌భ్యుల‌ను ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ద్ద వ‌దిలేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close