ఆరెంజ్ రీ రిలీజ్ షేర్ అంతా జనసేనకే !

సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ఒకటి, రెండు రోజులు ఆడించి ఆ షేర్ ను సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఇటీవలి కాలంలో రొటీన్ అయింది. అయితే పెద్దగా విజయవంతం కానీ రామ్ చరణ్ ఆరెంజ్ ను రీ రిలీజ్ చేయాలని ఆ సినిమా నిర్మాత నాగబాబు డిసైడయ్యారు. అయితే అది వ్యక్తిగత లాభానికి కాదు. జనసేన కోసం.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించారు.

జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో జనసైనికులంతా పాల్గొనాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. రామ్ చరణ్ జన్మదనం సందర్భంగా మార్చి 25, 26న కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’ ను మెగా అభిమానులు, జన సైనికులు సినిమా చూసి వినోదంతో పాటు జనసేనను బలపేతం చేసే ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విజ్ఞప్తి చేసింది.

క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన ‘ఆరెంజ్’ ఆర్థికంగా అట్టర్ ఫ్లాప్‌ అయింది. అయితే ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చింది. మొన్నటివరకూ టీవీ షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నాగబాబు.. ఇప్పుడిప్పుడే జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటూ తోడుగా ఉంటున్నారు. అందులో భాగంగానే రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ రీ రిలీజ్ చేసి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడం పట్ల జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close