పఠాన్ కోట్ పై దర్యాప్తు పురోగతి భారత్ సహకారంపైనే ఆధారపడుతుంది: పాక్

పఠాన్ కోట్ పై దాడి జరిగి మూడు నెలలు పూర్తయ్యాయి కానీ ఇంతవరకు ఆ కుట్రకు పాల్పడినవారిని పాక్ ప్రభుత్వం పట్టుకోలేదు. ఈ దాడికి కుట్రపన్నిన జైష్ ఏ మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని గృహ నిర్బంధంలో ఉంచమని చెప్పుకొంటున్నా అది నిజమని నమ్మలేము. పాక్ ప్రభుత్వం ఆ దాడికి కుట్ర పన్నినవారిపై చర్యలు తీసుకోకపోగా, భారత్ సహకరిస్తేనే దర్యాప్తు చేసేందుకు వీలవుతుందని చెపుతూ బంతిని భారత్ కోర్టులో పడేసి చేతులు దులుపుకొంది. పఠాన్ కోట్ దాడిపై తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాస్థాయి సిట్ దర్యాప్తు బృందం త్వరలో పఠాన్ కోట్ వస్తారని వారి దర్యాప్తుకు భారత అధికారులు సహకరిస్తారని తాము ఆశిస్తున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి విదేశీ విధాన సలహాదారుగా పనిచేస్తున్న సర్తాజ్ అహ్మద్ అన్నారు.

ఆయన వాషింగ్టన్ పర్యటనలో అక్కడి మీడియాతో మాట్లాడుతూ, “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే మా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. అయితే దానిని అమలుచేయడం అంత తేలిక కాదు. పఠాన్ కోట్ పై సాగుతున్న దర్యాప్తు పురోగతి భారత్ మాకు అందించే సహకారంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం కోసం మేము చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాము. ఇరు దేశాల సంబంధాలను దానితో సంబంధం లేని ఇతరులు ప్రభావితం చేయకుండా భారత్ జాగ్రత్తపడాలని మేము కోరుకొంటున్నాము,” అని అన్నారు.

నిజానికి భారత్-పాక్ దేశాల మధ్య చర్చలు జరపాలనుకొన్న ప్రతీసారి కూడా పాకిస్తాన్ అంతకంటే ముందుగా కాశ్మీరీ వేర్పాటు వాదులయిన హురియత్ నేతలతో చర్చలు జరపాలని పట్టుబడుతుండేది. దానిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించేది. ఆ కారణంగానే గత ఏడాది జరుగవలసిన భారత్-పాక్ చర్చలు రద్దయ్యాయి. అలాగే కాశ్మీర్ సమస్యపై అమెరికా లేదా మరో దేశాన్ని జోక్యం చేసుకోమని ఒత్తిడి చేస్తుండేది. దానినీ భారత్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ సంగతి తెలిసి కూడా పాక్ ఇప్పుడు భారత్ కి ఈవిధంగా సలహా ఇస్తుండటం విచిత్రంగానే ఉంది.

మూడు నెలలు గడిచిపోయినా ఇంకా పఠాన్ కోట్ పై దర్యాప్తు కొనసాగుతోందని ఒకసారి, భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోలేదని మరొకసారి, భారత్ సహకరిస్తే తప్ప దర్యాప్తు ముందుకు సాగదని రకరకాలుగా మాట్లాడుతూ ఆ కుట్రకు పాల్పడినవారిని ఎవరినీ అరెస్ట్ చేయకుండా కాలక్షేపం చేసేస్తూనే ఇప్పుడు భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం వెంటనే జరపాలని అమెరికా వెళ్లి అక్కడి నుండి భారత్ పై ఒత్తిడి తెస్తోంది. పఠాన్ కోట్ పై దాడికి కుట్రపన్నిన వారిని పాకిస్తాన్ ఇంతవరకు అరెస్ట్ చేయకపోయినా భారత్ చాలా సంయమనం పాటిస్తూనే ఉంది. పాక్ పై ఒత్తిడి చేయలేకపోయినా ఆ దేశం చేస్తున్న ఈ ఒత్తిడి కారణంగా ఏదో ఒకరోజు విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ఓకే చెప్పేస్తుందేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close