2019 ఓటర్ల లిస్ట్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు..!

పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు చేసిన చిట్ట చివరి ప్రయత్నమూ ఫెయిలయింది. 2021 ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్ శాఖ ప్రచురించకపోవడంతో 2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల కమిషన్.,. పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల మూడున్నర లక్షల మంది యువ ఓటర్లు ఓటింగ్‌కు దూరమవుతారని.. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని.. తక్షణం ఎన్నికలు నిలిపివేసి.. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి దూళిపాళ్ల అఖిల అనే యువతి దాఖలు చేయగా..మరొకటి ఓ న్యాయవాది దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు… ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టి వేసింది.

2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో తనకు ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని ధూళిపాళ్ల అఖిల వాదించారు. అయితే.. ఆమె అసలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ విషయాన్ని ఎస్‌ఈసీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను కొట్టి వేసే అవకాశం ఉందని ముందుగానే గుర్తించడంతో మరో లాయర్‌తోనూ అలాంటిపిటిషనే వేయించారు అధికార పార్టీ నేతలు. రెండింటిపైన విచారణ జరిపిన హైకోర్టు.. చివరికి జోక్యం చేసుకోలేమని తేల్చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణలో 2019 ఓటర్ల జాబితాను ఉపయోగించడానికి కారణలేమిటో ఎస్‌ఈసీ ప్రత్యేక అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు సమర్పిస్తుందని.. హైకోర్టుకు హామీ ఇచ్చినా గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లు ఓటర్ల జాబితాను ప్రచురించలేదని కోర్టు దృష్టికి బలంగా తీసుకెళ్లి వారు చేసిన తప్పును చట్ట ప్రకారం… కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా తేలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఎస్‌ఈసీ అంత కఠినంగా వ్యవహరించలేదు. దీంతో ఆ అధికారులు ఇద్దరూ ఓటర్ల జాబితా విషయంలో కోర్టు ధిక్కరణ చర్యలకు గురి కాకుండా ఈ పిటిషన్ విషయంలో బయటపడ్డారని న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close