దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని… దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే మార్గాలను అనుసరిస్తున్నారని అంటున్నారు. గతంలో ఎంపీ నందిగం సురేష్ ఈ విషయంలో దూకుడుగా.. ఉండగా.. తాజాగా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పండుల రవీంద్రబాబును రంగంలోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. పండుల రవీంద్రబాబు.. జడ్జిలు.. కోర్టులు… జగన్ వెంట్రుకను కూడా పీకలేవంటూ… చాలా దారుణమైన భాషతో తాజాగా.. విమర్శలు చేశారు.

గతంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్.. హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. మొదట ఇంగ్లిష్ మీడియం వివాదంపై.. న్యాయమూర్తుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత కాల్ లిస్ట్ బయటపెట్టాలంటూ… ఆరోపణలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా అవే వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు సీరియస్ అయిన తర్వాత… న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలను కంట్రోల్ చేశారు. కానీ.. ఇప్పుడు… పండుల రవీంద్రబాబు మళ్లీ విమర్శలు చేయడంతో.. వైసీపీ.. దళిత నేతలను ముందు పెట్టి.. న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచాలనుకునే వ్యూహాన్ని అమలు చేస్తోందని భావిస్తున్నారు.

సాధారణంగా వైసీపీ నేతలు… పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సందేశాలకు అనుగుణంగానే మాట్లాడతారు. లేకపోతే.. మాట్లాడరు. ఆ పార్టీలో అలాంటి కట్టుబాటు ఉంది. ఎంతటి సీనియర్ నేత అయినా… అది తప్పదు. నందిగం సురేష్, పండుల రవీంద్రబాబు వంటి వారు దానికి మినహాయింపు కాదు. హైకమాండ్ పర్మిషన్ లేకపోతే. ప్రెస్ మీట్ కూడా పెట్టరు. అందుకే… వైసీపీ తీరుపై అనేక సందేహాలు వస్తున్నాయి. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. దళితులే బలవుతారని.. దాన్ని రాజకీయం చేసుకోవచ్చన్నట్లుగా వైసీపీ వ్యూహం ఉందనే.. అభిప్రాయాలు.. ఇతర పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close