నెల్లూరు కోర్టులో “సాక్ష్యాల దొంగతనం” !

కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకా నెల్లూరు రాలేదు. కానీ ఆయనపై ఉన్న కీలక కేసుల్లో సాక్ష్యాలను మాత్రం నెల్లూరు కోర్టు నుంచి కొంత మంది మాయం చేశారు. మామూలుగా మాయం అయితే అవి జాగ్రత్తగా ఉంచాల్సిన కోర్టు ఉద్యోగుల మీద అనుమానం వస్తుంది కాబట్టి ఓ షిక్కటి చీకటి రాత్రిలో తాళాలు బద్దలు కొట్టి.. సాక్ష్యాలు తీసుకెళ్లిపోయారు. అవసరమైనవి మాత్రమే తీసుకెళ్లి.., మిగతావి కోర్టు ఆవరణలో పడేశారు. ఆ అవసరమైనవి అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న ఫోర్జరీ కేసులో కీలక సాక్ష్యాలు మాత్రమే.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పత్రాలు కాకాణి మీడియా ముందు పెట్టి రచ్చ రచ్చ చేశారు. దానికి వైసీపీ మీడియా తోడయింది. చివరికి అవి ఫేక్ పత్రాలను.. ఫోర్జరీ చేశారని పోలీసులు గుర్తించి చార్జిషీట్ వేశారు. ఇందులో ఏ – వన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆయనపై దాదాపుగా నేరం రజువుయింది. ఇలాంటి సమయంలో సాక్ష్యాలను దొంగలెత్తుకెళ్లిపోయారు. నెల్లూరులో ఇది తాజా సంచలనం.

చాలా చోట్ల దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కానీ… కోర్టుల్లో దొంగతనాలు జరగడం.. ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగలేదు. అదీ కూడా సెలక్టివ్‌గా సాక్ష్యాలను దొంగతనం చేయడానికే ఈ పని చేయించినట్లుగా కనిపిస్తూండటం అనూహ్యంగా మారింది. ఈ దొంగతనాన్ని పోలీసులు ట్రేస్ చేయలేరు.. దొంగల్ని పట్టుకోలేరు.. ఎవర్నైనా పట్టుకున్నా సాక్ష్యాలను స్వాధీనం చేసుకోలేరు.. అనేది కామన్‌గా జరిగే తర్వాత సీన్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడే పోలీసులు అందరి అంచనాలను తారుమారు చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close