నెల్లూరు కోర్టులో “సాక్ష్యాల దొంగతనం” !

కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకా నెల్లూరు రాలేదు. కానీ ఆయనపై ఉన్న కీలక కేసుల్లో సాక్ష్యాలను మాత్రం నెల్లూరు కోర్టు నుంచి కొంత మంది మాయం చేశారు. మామూలుగా మాయం అయితే అవి జాగ్రత్తగా ఉంచాల్సిన కోర్టు ఉద్యోగుల మీద అనుమానం వస్తుంది కాబట్టి ఓ షిక్కటి చీకటి రాత్రిలో తాళాలు బద్దలు కొట్టి.. సాక్ష్యాలు తీసుకెళ్లిపోయారు. అవసరమైనవి మాత్రమే తీసుకెళ్లి.., మిగతావి కోర్టు ఆవరణలో పడేశారు. ఆ అవసరమైనవి అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న ఫోర్జరీ కేసులో కీలక సాక్ష్యాలు మాత్రమే.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పత్రాలు కాకాణి మీడియా ముందు పెట్టి రచ్చ రచ్చ చేశారు. దానికి వైసీపీ మీడియా తోడయింది. చివరికి అవి ఫేక్ పత్రాలను.. ఫోర్జరీ చేశారని పోలీసులు గుర్తించి చార్జిషీట్ వేశారు. ఇందులో ఏ – వన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆయనపై దాదాపుగా నేరం రజువుయింది. ఇలాంటి సమయంలో సాక్ష్యాలను దొంగలెత్తుకెళ్లిపోయారు. నెల్లూరులో ఇది తాజా సంచలనం.

చాలా చోట్ల దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కానీ… కోర్టుల్లో దొంగతనాలు జరగడం.. ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగలేదు. అదీ కూడా సెలక్టివ్‌గా సాక్ష్యాలను దొంగతనం చేయడానికే ఈ పని చేయించినట్లుగా కనిపిస్తూండటం అనూహ్యంగా మారింది. ఈ దొంగతనాన్ని పోలీసులు ట్రేస్ చేయలేరు.. దొంగల్ని పట్టుకోలేరు.. ఎవర్నైనా పట్టుకున్నా సాక్ష్యాలను స్వాధీనం చేసుకోలేరు.. అనేది కామన్‌గా జరిగే తర్వాత సీన్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడే పోలీసులు అందరి అంచనాలను తారుమారు చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close