మోడీ పిలుపునిచ్చాక అమిత్ షా ఆగుతారా..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. స్వదేశీ మంత్రం పఠించారు. అందరూ.. స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలని మంగళవారం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తూ.. దేశ ఆర్థిక స్వావలబన సాధించే ప్రణాళికలను వివరించారు. స్థానిక ఉత్పత్తులను వాడటం ద్వారా.. దేశం తయారీ రంగంలో ముందుకెళ్తుందన్నారు. ప్రధాని అలా పిలుపునిచ్చారో లేదో.. ఇలా అమిత్ షా… తన పరిధిలోని హోంమంత్రిత్వ శాఖలోని క్యాంటీన్లలో కేవలం స్వదేశీ తయారీ వస్తువులు మాత్రమే అమ్మాలని నిబంధనల తీసుకొచ్చారు. దీన్ని జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు. హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి పారాలమిటరీ క్యాంటీన్లు అన్నీ వస్తాయి. వీటిలో నిత్యావసర సరుకులు అన్నీ అమ్ముతూ ఉంటారు.

అలాగే.. ఉద్యోగుల కుటుంబాలకు కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా.. అమ్ముతూంటారు. వీటన్నంటిలోనూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి స్థానికంగా తయారైన వస్తువులను మాత్రమే అమ్ముతారు. అమిత్ షా నిర్ణయం వల్ల పది లక్షల మంది పారా మిలటరీ సిబ్బందితో పాటు వారి కుటుంబంలోని యాభై లక్షల మంది స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించ‌నున్నారు’. వీటి విలువ.. ఏటా రూ .2,800 కోట్ల వరకూ ఉంటుంది. అమిత్ షా ప్రారంభించారు.. ఇక మిగతా శాఖలు మాత్రం ఊరుకుంటాయా..? ఆయా శాఖల మంత్రులందరూ… తమ తమ శాఖల్లో ఇత స్వదేశీ వస్తవులే ఉపయోగించాలని.. వరుసగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ ట్రెండ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వలకూ పాకనుంది. ఏంతైనా స్వదేశీ నినాదం సెంటిమెంట్ చాలా బలమైనది.. అంతే బలంగా.. బీజేపీ ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సక్సెస్ అయితే.. భారత్‌లో విదేశీ వస్తువులకు గిరాకి తగ్గినట్లే అనుకోవాలి. కానీ.. ఎంత మేర.. భారతీయుల అవసరాల మేరకు ఇక్కడ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయన్నదే చాలా మందికి డౌట్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close