అసెంబ్లీలో ‘శ్రీమంతుడు’,’జబర్దస్త్’ ప్రస్తావన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై చర్చ సందర్భంగా మహేష్ సూపర్ డూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు, ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్ – జబర్దస్త్ ప్రస్తావన వచ్చింది. రిషితేశ్వరి కేసుపై వైసీపీ సభ్యురాలు రోజా మాట్లాడుతూ, మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్‌కు పిలిపించుకున్న ఘనత మంత్రులదని, వారి సంస్కారం అక్కడే అర్థమవుతుందని అన్నారు. విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు రిషిత చనిపోయిన తర్వాత తీరిగ్గా నాలుగు రోజులకు యూనివర్సిటీకి వెళ్ళి ప్రెస్‌మీట్ పెట్టి అరగంటపాటు మీడియాతో మాట్లాడి… శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనటానికి హడావుడిగా విమానమెక్కి హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. దీనిపై గంటా స్పందిస్తూ, రోజా వ్యాఖ్యలకు స్పందించటానికే ఇబ్బందిగా ఉందని అన్నారు. శ్రీమంతుడు ఆడియో కార్యక్రమంలో పాల్గొన్నది నిజమేనని, ఆ చిత్ర నిర్మాతలు తనకు బాగా కావలసినవారు కావటం, ఆ సినిమా మంచి సందేశాత్మకచిత్రం కావటంతో తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. తానేమీ జబర్దస్త్‌లాంటి కార్యక్రమాలలో పాల్గొనలేదని పరోక్షంగా రోజాను ఎద్దేవా చేశారు(జబర్దస్త్ కార్యక్రమంలో రోజాయే న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు). విమానాలలో ప్రయాణించటం తప్పేమీ కాదని చెప్పారు.

మరోవైపు మంత్రి పరిటాల సునీత రోజాకు గట్టి చురక అంటించారు. రోజా నాడు టీడీపీలో ఉన్న సమయంలో గ్రామగ్రామానికీ తిరిగి పరిటాల రవి ఫోటోలకు దండలు వేశారని, ఆయనను హత్యచేసింది వైఎస్సేనని ఊరూరూ తిరిగి చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పుడు తాను, తనకొడుకు హత్యారాజకీయాలను చేస్తున్నట్లు ఆరోపించటం విడ్డూరంగా ఉందన్నారు. దీనితో రోజా గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్‌కు వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close