పటేల్ ఆందోళన : ఓటు బ్యాంకు లెక్కల్లో… సమాజం ముక్కలు చెక్కలు…

దేశాన్ని ఎలా బాగుచేయాలని అని ఆలోచించడం కాదు, ఆ మాట అంటేనే జోకులా నవ్వే రాజకీయ నాయకులున్న దేశం మనది. పైకి ఉపదేశాలిచ్చి లోన పచ్చి అవినీతిలో తలమునకలైన వారే ఎక్కువ. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వారు తగ్గిపోయిన ఫలితంగా అనర్థాలు పెరుగుతున్నాయి. గుజరాత్ లో ఈమధ్య ఓ కొత్త ఆందోళన మొదలైంది. పటైల్ వర్గీయులను ఓబీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని వేల మంది సభలు, ర్యాలీలు జరుపుతున్నారు. మంగళవారం నాడు అహ్మదాబాద్ లో భారీ సభ నిర్వహించారు.

పటేల్. గుజరాత్ లో రాజకీయంగా పైచేయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరిన కుటుంబాటే ఎక్కువ. సామాజికంగా అగ్రవర్ణం. వీరు కూడా ఓబీసీల్లో చేరాలని ఆందోళన చేస్తుంటే ఇక వెనుకబాటు అనం అనే మాటకు అర్థం ఏముంటుంది అని ఇతర ఓబీసీలు ప్రశ్నిస్తున్నారు. పటేళ్లకు వ్యతిరేకంగా ఓబీసీలు ఆందోళన బాట పట్టారు. వారికి ఓబీసీ హోదా ఇవ్వ వద్దని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పటేళ్లకు ఓబీసీ హోదా కుదరదని చెప్తోంది.

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గుజరాత్ లో పటేళ్ల రాజ్యం నడుస్తోంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పటేల్ వర్గీయురాలే. గుజరాత్ లో ఆ వర్గానికి చెందిన వారు చాలా మంది ముఖ్యమంత్రులుగా పరిపాలనచేశారు. సీఎం పదవిలో లేకపోయినా చక్రం తిప్పిన పటేళ్లు చాలా మందే ఉన్నారు. ప్రవాస భారతీయుల్లోనూ పటేళ్లకు ఎంతో గుర్తింపు ఉంది. ఇప్పుడు వీరి ఆందోళన మరెందరికో స్ఫూర్తి ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్రాల్లో కాస్త సంపన్న, సాజాజిక అగ్రవర్ణాలు అని పేరున్న వారు కూడా రిజర్వేషన్ల కోసం మళ్లీ ఆందోళకు దిగే అవకాశం ఉంది.

ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి తప్ప మరేదీ పట్టని స్వార్థ రాజకీయాల ఫలితమిది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నిజంగా ప్రజల కోసం పనిచేసిన రాజకీయ నాయకులు చాలా తక్కువైపోయి, అవినీతి పెరిగిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజరికం వచ్చేసింది. రాజ్యాల్లాగా నియోజకవర్గాలను రాసిస్తున్నారు. డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారు. నోట్లు పెట్టి ఓట్లు కొంటున్నారు. ప్రజలను ఆలోచన లేని ఆటబొమ్మలుగా చేస్తున్నారు. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చడానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. వారు ఆత్మగౌరవంతో బతకడం నేర్పడం లేదు. ప్రతిదానికీ ప్రభుత్వం ముందు చేయి చాపడం అలవాటు చేస్తున్నారు. ఇష్టారాజ్యం చెలాయిస్తున్నారు.

అందుకే, రిజర్వేషన్ల కోసం కొత్త కొత్త ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి. పటేళ్ల రిజర్వేషన్ ఆందోళన ఎటు వైపు దారితీస్తుందో చూడాలి. వీరి స్ఫూర్తితో ఈ ట్రెండ్ ఇంకా పెరిగితే, వ్యతిరేకుల ఆందోళనలతో సమాజం మరింతగా ముక్కచెక్కలయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close