యువగళం ముగింపు సభలో పవన్ , చంద్రబాబు కీలక ప్రకటనలు !

బుధవారం విజయనగరం జిల్లా బోగాపురం వద్ద నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ముగింపు సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ నలుమూలల నుంచి విశాఖపట్నం విజయనగరం టీడీపీ నేతలు, శ్రేణులు వచ్చారు. యువగళం ముగింపు సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా టీడీపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షలకు పైగా సభకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు.

రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి విజయనగరానికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. లోకేశ్​ జైత్రయాత్ర విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్​ కల్యాణ్ ​ హాజరుకానున్నారు. బహిరంగ సభ నుంచే ఇరు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇరు పార్టీల అధినేతలు కీలక ప్రకటనలు వెల్లడించే అవకాశం ఉంది.

ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా టాప్ టెన్ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 27, 2023న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజక వర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. లోకేశ్​ మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close