జ్వరంతో పవన్ ప్రచార షెడ్యూల్ అప్ సెట్

పవన్ కల్యాణ్ వారాహి బయటకు తీయడం ఏమిటో కానీ.. పరుగులు పెట్టడం కన్నా.. బ్రేకులు పడటమే ఎక్కువ అయింది. చాలా రోజుల విరామం తర్వాత ఎన్నికలు అయిపోయే వరకూ ప్రచారం చేయాలని పిఠాపురం నుంచి ప్రారంభిస్తే.. జ్వరం ఆయనను ఇబ్బంది పెడుతోంది. పిఠాపురంలో ప్రచారం ప్రారంభించిన రోజునే జ్వరం వచ్చింది. ఎలాగోలా ఒక్క రోజు విశ్రాంతి తీసకుని ప్రచారం చేసినా మళ్లీ తిరగబెట్టింది. దాంతో తెనాలి నుంచి జరగాల్సిన ఇతర నియోజకవర్గాల ప్రచారాన్ని వాయిాద వేసుకున్నారు.

ముందుగా అనుకున్న దాని ప్రకారం మడో తేదీన తెనాలి.. నాల్గో తేదీన నెల్లిమర్ల, ఐదో తేదీన అనకాపల్లి, ఆరున యలమంచలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. అక్కడ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో భేటీ కావాల్సి ఉంది. ఏడో తేదీన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని కాకినాడ కు చేరుకుని కోస్తా జిల్లాల్లో ప్రచారం 8 నుంచి ప్రారంభించాలని ్నుకున్నారు. 9వ తేదీన ఉగాది రోజున పిఠాపురంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశించేలా చూసుకున్నారు. ఇలా పన్నెండో తేదీ వరకూ ప్రచారం ప్లాన్ చేశారు. జ్వరం కారణంగా మొత్తం షెడ్యూల్ అప్ సెట్ అయింది.

పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ పేర్లను ఖరారు చేశారు. దీంతో అన్నిస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఇక ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేపట్టడమే మిగిలింది. పవన్ పర్యన రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభించేందుకు జనసేన వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close