ఆయిల్ కంపెనీల “మస్కా” బయటపెట్టిన పవన్..!

సీఎస్ఆర్ నిధులన్నీ పీఎం కేర్స్‌కి.. సీఎంరిలీఫ్ ఫండ్‌కు పంపింగ్ చేస్తూంటే.. వాస్తవంగా ఆయా కార్పొరేట్ సంస్థలు ప్రజలకు చేయాల్సిన సేవ ఎలా చేస్తాయి..?. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా ఎత్తి చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లోని కోనసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని ఆనేక సంస్థలు తోడుకుంటున్నాయి. వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. కానీ కోనసీమ ప్రాంతానికి చేస్తున్న సాయం మాత్రం అంతంతమాత్రమే. చివరికి కోవిడ్ లాంటి సంక్షోభ సమయాల్లోనూ అదుకుంటున్న వారు లేరు. మొదటి విడత కరోనా వేవ్ సమయంలో… ఆయిల్ సంస్థ పెద్ద పెద్ద హామీలు ఇచ్చాయి.

కోనసీమలో రూ.200 కోట్లతో వైద్య వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. కానీ రెండో వేవ్ వచ్చినా వాటి పనుల ఊసు లేదు. ఫలితంగా ఇప్పుడు.. కోనసీమ ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. కనీసం అంబులెన్స్ సౌకర్యాలు కూడా లేవు. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. ఎక్కడా సౌకర్యాలు కనిపించడం లేదు., చనిపోతే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. వైసీపీ ఎంపీలు మాట్లాడుకున్న వీడియోలోని మాటలే సాక్ష్యం. ఆయిల్ కంపెనీలు తమ సీఎస్ఆర్ ఫండ్స్‌తో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అందుకే పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ లేఖ రాశారు. ఆయిల్ కంపెనీలు.. హామీ ఇచ్చిన మేరకు.. అమలు చేశాయో ఉన్నతాధికారులు తక్షణమే సమీక్షించి.. ఆ హామీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సంక్షోభం సమయంలో.. ప్రభుత్వాలు సీఎస్ఆర్ నిధులను.. పీఎంకేర్స్, సీఎంఆర్ఎఫ్‌లకు ఇస్తే సరిపోతుందని రూల్ మార్చారు. ఫలితంగా కంపెనీలు పేదల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు.. ప్రభుత్వ ఖాతాలోకే వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close