మోడీపై విమర్శా పవనం!

జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో ఈ రోజు సిపిఎం సిపిఐ నాయకులు జరిపిన చర్చలు ఒక కీలకమైన రాజకీయ ఘట్టాన్ని ఆవిష్కరించాయి. టిడిపి వైసీపీలకు భిన్నమైన ఒక బలీయమైన తృతీయ ప్రత్నామ్నాయాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముందు స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ కేంద్రంపై ప్రధానిపై ప్రత్యక్ష విమర్శ చేయలేదన్న అపప్రధను పోగొట్టే విధంగా పవన్‌ ఈ సందర్భంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ పార్లమెంటును గౌరవిస్తారని అప్పట్లో తాను అక్కడే వుండి చూసి అనుకున్నానని కాని ఆయన హామీలను నెరవేర్చకపోవడం, అవిశ్వాసాన్ని అనుమతించకపోవడం వల్ల విశ్వసనీయత పోగొట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని నిరశన దీక్షను కూడా తాము నమ్మలేమన్నారు. అలాగే ఇంతకాలం బిజెపిని కేంద్రాన్ని బలపర్చిన చంద్రబాబు నాయుడు హఠాత్తుగా ఆందోళనలు చేస్తామంటే నమ్మశక్యం కాదని ప్రకటించారు. 16న ప్రత్యేకహౌదా సాధన సమితి బందపిలుపున్‌కు మాత్రం మద్దతునిస్తామన్నారు. గతంతో పోలిస్తే కొద్దిసేపే మాట్లాడినా ఈ సారి పవన్‌ స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. విజయవాడ పాదయాత్రకు కొనసాగింపుగా అనంతపురంలో తలపెట్టిన కార్యక్రమాన్ని మాత్రం కొంత కాలం వాయిదా వేసినట్టు కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close