ఎకరానికి రూ. 8వేలు..! ఇది పవన్ కల్యాణ్ రైతు బంధు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… రైతులకు ఓ వరం ఇచ్చారు. రైతు బంధు తరహాలో ఓ పథకం ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఎకరానికి రూ. ఎనిమిది వేల చొప్పున రైతలకు అందజేస్తానని ప్రకటించారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో “వీర మహిళ” నిర్వహించ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ పథకాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన మార్చి 14న ప్రకటిద్దామని అనుకున్నానని.. అయితే, మహిళా దినోత్సవం రోజున ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ ప్రకటన చేశానని ప్రకటించారు. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్ అని డైలాగ్ చెప్పే పవన్ కల్యాణ్.. సంక్షేమ పథకాల పేరుతో.. ఉచిత పథకాలను కూడా హోరెత్తిస్తున్నారు.

ఇప్పటికే ఉచిత సిలిండర్లు సహా.. అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. తాజాగా.. రైతులకు ఎకరానికి రూ. ఎనిమిది వేల సాయం ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు.,. రైతు బంధు పథకం.. భారీ స్థాయిలో ఓట్లు తెచ్చి పెట్టిందని ప్రచారం జరగడంతో.. ఆ పథకంపై.. పార్టీలు దృష్టి పెట్టాయి. రైతులకు నేరుగా.. నగదు బదిలీ చేసే పథకాలను ప్రవేశ పెట్టాయి. కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ పథకంతో.. నేరుగా.. రైతులకు డబ్బులు జమ చేస్తోంది. విడిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పనిలో ఉన్నాయి. ఏపీలో… టీడీపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పేరుతో.. ఇప్పటికే పథకం ప్రారంభించింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇలాంటి పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. ఆ జాబితాలో ఇప్పుడు పవన్ కల్యాణ్ చేరారు. మొత్తానికి పవన్ కల్యాణ్ కూడా.. సంక్షేమ పథకాల విషయంలో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయ రాజకీయ పార్టీల్లాగే.. ప్రకటనలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close