ధాన్యం రైతుల కోసం మరోసారి జనసేనాని..!

ధాన్యం రైతులకు చెల్లించాల్సిన నిధులను ఏం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ రూ. రెండు వేల కోట్లకుపైగా బాకీ ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ధాన్యం సేకరించిన ప్రభుత్వం వారికి చెల్లింపులు చేయలేదు. గతంలో ఇదే అంశంపై రైత సౌభాగ్య దీక్ష చేసిన పవన్ కల్యాణ్… అప్పట్లో.. ప్రభుత్వం.. ధాన్యం రైతులకు 48 గంటల్లో చెల్లించాల్సిన సొమ్మును చెల్లించేందుకు నిధులు కేటాయించామని ప్రకటిందని.. ఆ నిధులన్నీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన ప్రభుత్వమే రైతులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.

ధాన్యం అమ్ముకొని వారాలు గడుస్తున్నా…ఇప్పటికీ సొమ్ములు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని .. రైతు సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి.. చివరికి ధాన్యం అమ్మిన సొమ్ము కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. లక్ష మందికిపైగా రైతులకు మొత్తం రైతులకు రూ.2,016 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని సొమ్ములు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లో ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకపోతే… తదుపరి కార్యాచరణ ప్రారంభించాలనే ఆలోచన జనసేన నేతల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతోంది కానీ… కార్యాచరణలో మాత్రం.. అసలు నిధులు కేటాయించడం లేదని జనసేన భావిస్తోంది. అందుకే గతంలో తాము రైతు సౌభాగ్య దీక్ష చేశామని… సమస్యను పరిష్కరించకపోతే.. మరోసారి అలాంటి కార్యాచరణ ప్రకటించాలని అనుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close