బీజేపీ “సీఎం ట్రాప్‌”..పడిపోయిన పవన్..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ సీఎం ట్రాప్ వేసింది. ఆయనను ఆయన వర్గాన్ని… ఆయన ఫ్యాన్స్‌ను మొత్తంగా బీజేపీవైపు మళ్లించే ట్రాప్ వేసింది. దీనికి పవన్ కల్యాణ్ పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆయన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారం రోజుల పాటు పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జనసైనికుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోది.

పవన్‌పై ఇప్పుడే అంత ప్రేమ ఎందుకు..!?

తిరుపతిలో జరిగిన బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొగిడిన తీరు చూసి జనసైనికులు కూడా తేడాగా ఉందే అనుకున్నారు. ప్రధాని మోదీ పవన్‌ కళ్యాణ్‌ను పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నారని .. దానికి తాము రెడీగా ఉన్నామని ఆయన నెక్ట్స్ లెవల్ పొగడ్తలు వినిపించారు. నిజానికి పొత్తులు పెట్టుకున్న తర్వాత బీజేపీ, జనసేన మధ్య పరిస్థితులు అంత సజావుగా లేవు. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా చెప్పడానికి సోము వీర్రాజు గతంలో మొహమాట పడ్డారు. బీసీ సీఎం అని.. మరొకటని ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు.. మాత్రం మోడీ మాటగా.. సీఎం పవన్ అంటున్నారు.

పవన్ ఫ్యాన్స్.. బలిజ వర్గం ఓట్ల కోసమే గురి..!

తిరుపతిలో పోటీ చేయడానికి జనసేన ఆసక్తి చూపింది. అక్కడ సంప్రదాయంగా జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి బీజేపీ పోటీ చేస్తోంది. దీంతో జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గంలోని తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా జనసేన అభ్యర్ధి అయితేనే ఓటు వేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఓవీ రమణ అనే బలిజ వర్గం బీజేపీ నేతను అవమానించి పార్టీ నుంచి పంపేశారు సోము వీర్రాజు. ఇది కూడా ఆ వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో అసంతృప్తికి గురైన బలిజ ఓటర్లును బుజ్జగించటానికి సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌ను వాడారు.

రేపు ఎక్కువ ఓట్లొస్తే జనసేనను మరింత తగ్గించే అవకాశం..!

గత ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికలతో పాటు పోటీ చేసిన అన్ని స్ధానాల్లో బిజెపి డిపాజిట్లను కోల్పోయింది. పైగా రాష్ర్టంలో నోటా కంటే బిజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వారి బలం ఏమీ పెరగలేదు. ఉన్న మార్పల్లా ఒక్కటే.. అదే పవన్‌తో పొత్తు. పవన్‌ను దువ్వితే జనసైనికులు తమకు ఓట్లు వేస్తారని, ఆ ఓట్లతో రాష్ర్టంలో తమ బలం పెరిగిందని బిజేపీ చెప్పుకునేందుకు ప్లాన్‌ గీసింది. ఇప్పుడు జనసేన మద్దతుతో బీజేపీకి లక్షో..రెండు లక్షలో ఓట్లు వస్తే.. తమ బలం అనిచెప్పి.. రేపు జనసేనను బీజేపీ మరింత పరిమితం చేస్తుంది. బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించే విధానం అలాగే ఉంటుంది.జనసేనతోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. మరి జనసేన తెలివిగా రాజకీయం చేయగలుగుతుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close