ట్యాపింగ్ ఇష్యూలో పవన్ ఎంట్రీ – కేంద్ర హోంశాఖకు …

ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్నా, డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు , ట్యాపింగ్ వ్యవహారాలపై పవన్ తొలి సారి స్పందించారు. ఎమ్మెల్యేలే ప్రాణభయంతో వణికిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత లేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ అంశాన్ని నేరుగా సీఎం.. ఆయన కార్యాలయంపైనే ఆరోపణలు చేశారన్నారు. సొంత ఎమ్మెల్యేలపై నిఘాలు, సంభాషణలు దొంగ చాటుగా వినడం.. అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయని జగన్ పై మండిపడ్డారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా డీజీపీ, హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదని పవన్ ప్రశ్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై డీజీపీ స్పందించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రారంభమైన అలజడి… ఆ పార్టీలో సునామీలా మారుతోంది. ఈ అంశంపై టీడీపీ నేతలు ఇంత వరకూ స్పందించలేదు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీపైనే ఆరోపమలు చేస్తున్నారు. వారు టీడీపీతో మాట్లాడుకున్నారని అంటున్నారు. కానీ టీడీపీ మాత్రం పరిణామాలను గమనిస్తోంది. అయితే ఈ ఇష్యూ పవన్ నేరుగా స్పందించారు. తక్షణం డీజీపీ బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. కోటంరెడ్డి తరహాలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాననడం కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close