పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ డేట్లు ఇచ్చారు. ఆ సినిమా కూడా పూర్తి కావొస్తోంది. మరో వైపు ‘ఉస్తాద్’ షూటింగ్ లోనూ పాలు పంచుకొంటున్నారు. ఇప్పుడు మరో కొత్త కథ విన్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈసారి తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్కు కథ చెప్పార్ట. వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ కు నచ్చిన సినిమా ఇది. కాకపోతే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఆ సమయంలోనే సముద్రఖనితో మరో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చార్ట. ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతోంది.
పవన్ ఇది వరకే కొంతమంది నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొన్నారు. చాలామట్టుకు తిరిగి ఇచ్చేశారు. ఇంకొంతమందికి బాలెన్స్ వుంది. అందులో ఓ నిర్మాత కోసం ఈ సినిమా పూర్తి చేయబోతున్నారని టాక్. తక్కువ సమయంలో, పరిమిత బడ్జెట్ లో తీయగలిగే కథ ఇది. అందుకే ఈ సినిమాని పవన్ ఓకే చేశారని తెలుస్తోంది. ఇటీవలే…. సముద్రఖని పవన్ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. `ఉస్తాద్` పూర్తయిన తరవాత ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లొచ్చు. మరోవైపు త్రివిక్రమ్ కూడా పవన్ కోసం కథలు వింటున్నార్ట. వీలుని బట్టి, పవన్ మూడ్ ని బట్టి పట్టాలెక్కించడానికి కొన్ని కథల్ని రెడీ చేసే ఉద్దేశంలో ఉన్నారు త్రివిక్రమ్.