దివిస్ ఫార్మా బాధితులను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ ఫార్మా కంపెనీకి జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో దాని ప్రభావిత ప్రాంతాలు అయిన దానవాయిపేట, కొత్తపాకాల పరిసర ప్రాంతాల ప్రజలు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆందోళన చేస్తూ ఉండడం, దాదాపు వందకు పైగా ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం తెలిసిందే. అయితే ఈ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, ఆందోళన చేస్తున్న ప్రజలతో చర్చించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే…

జనవరి 9వ తేదీన దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని ఆ పార్టీ మీడియా హెడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కంపెనీకి అనుమతులు ఇచ్చిన సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫార్మా కంపెనీ తో కుమ్మక్కయి ఒక పెద్ద డీల్ చేసుకుని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. 2016 లో ఇదే సమస్యపై ఇదే ప్రాంతాలలో పర్యటించిన జగన్ తాము అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కట్ చేస్తే, ఇప్పుడు మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అప్పుడు ఆందోళనకారులపై చంద్రబాబునాయుడు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పిన జగన్ హయాంలో ఇప్పుడు వందకు పైగా కేసులు ఆందోళనకారులపై నమోదు అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, అటు టిడిపి ఇటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు రెండూ తమను మోసం చేశాయి అన్న భావనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్న నేపథ్యంలో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరిని సందర్శిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మరి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏ మేరకు ప్రభావం చూపుతుంది అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close