అమరావతిని కాపాడటానికి బీజేపీతో కలుస్తున్న పవన్..!?

అమరావతి రైతుల్ని ఆదుకోవాలంటే.. రాజధాని తరలి పోకుండా ఉండాలంటే.. బీజేపీతో కలిసి పోరాడటమే శరణ్యమని పవన్ కల్యాణ్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. అవి సఫలమైనట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. జేపీ నడ్డాతో జరిగిన సమావేశాల్లో పవన్ కల్యాణ్.. అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న ఆణచివేతతో పాటు… రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఎలా ఉందో వివరించినట్లుగా తెలుస్తోంది. కాకినాడలో వైసీపీ దాడుల దృశ్యాలతో పాటు… అక్కడ దాడి చేసిన వారిని వదిలి పెట్టి.. జనసైనికులపైనే కేసులు పెట్టిన విషయాన్ని నడ్డాకు పవన్ వివరించినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.

అమరావతిలో ఏం జరుగుతుందో.. మొత్తం తమకు తెలుసని.. .. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని.. దీనిపై.. మేథోమథనం చేస్తున్నట్లు నడ్డా చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసి ఓ ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట.. బీజేపీతో తాను ఎప్పుడూ దూరంగా లేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే.. రాష్ట్ర బీజేపీతో మాత్రం… ప్రత్యేక హోదా విషయంలో విబేధించిన తర్వాత కలిసి పని చేయలేదు. దీనికి కారణం.. బీజేపీ నేతలు.. పవన్‌తో.. స్నేహం కోరుకుటున్నప్పటికీ.. అది.. విలీనమే కావాలని చాలా కాలంగా అడుగుతున్నారు. ఆ బాధ్యతను రామ్‌మాధవ్ తీసుకుని పలుమార్లు.. పవన్ తో చర్చలు జరిపారు.

అమెరికాలోనూ దీనిపై.. పవన్ తో భేటీ అయ్యారు. తన పార్టీని విలీనం చేయాలని అడుగుతున్నారని.. కానీ చేయబోనని.. పవన్ చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు.. బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో.. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఫలితాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు.. బీజేపీతో కలిసి నడుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close