జనం కోసం జగన్‌ : శివుడి రుద్రాభిషేకానికి రెడీనా?

జనం కోసం జగన్‌- జగన్‌ కోసం జనం.. పార్టీ పరిస్థితులు ఎటుపోయి ఎటు వచ్చినా.. వారు చెప్పుకునే ఈ నినాదంలో మాత్రం తిరుగులేదు. అయితే జనం సంక్షేమం కోసం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈసారి పరమశివుడికి రుద్రాభిషేకం చేయబోతున్నారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి, ఇబ్బందులు లేకుండా బతకడానికి ఆయన పరమశివుడికి భారీ స్థాయిలో రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

జగన్‌ తన లోటస్‌పాండ్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఆయన పార్టీ పండితుడు మారేపల్లి రామచంద్రశాస్త్రి సహజంగానే.. ఆయనకు అనుకూలమైన రీతిలో పంచాంగ గ్రహనిర్దేశాలను చదివి వినిపించారు. ఇదంతా ఎక్కడైనా మామూలే అనుకున్నప్పటికీ.. ఆయన చెప్పిన కొన్ని సంగతులు మాత్రం గమనించదగినవి.

ఈ ఏడాది వర్షాలు బాగా ఉంటాయని అన్ని పార్టీల పండితులూ చెబుతున్నారు. నిజానికి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఈ ఏడాది ఎండల మాదిరిగానే వానలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చాలాకాలం ముందునుంచే చెబుతున్నారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పండితుడు మాత్రం వర్షాలు బాగా కురుస్తాయి గానీ.. అకాల వర్షాలు కురిసి పంటలకు నష్టం వాటిల్లుతుందంటూ అశుభం కూడా సెలవిచ్చారు. అయితే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆయన సెలవిచ్చారు.

తమ పార్టీ పండితుడు చెప్పిన పరిష్కారం ప్రకారం రాష్ట్ర ప్రజల్ని సుఖశాంతులతో అలరింపజేయడానికి వైఎస్‌ జగన్మోహనరెడ్డి భారీ స్థాయిలో పరమశివుడి రుద్రాభిషేకం కార్యక్రమానికి పూనుకుంటారా? లేదా చంద్రబాబు నాయుడు పాలనలో సుఖసంతోషాలతో ఉండకపోతే మాత్రం తన వైఫల్యం కిందికి కాదు కదా అని సరిపెట్టుకుని ఊరకుంటారా? అనేది నలుగురూ మాట్లాడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close