ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ గెస్ట్ హౌజ్ నుంచే ప్రణాళికలు..!!

ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్ది పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జూబ్లిహిల్స్ లోని గెస్ట్ హౌజ్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనేక అంశాలు చర్చకు వచ్చేవని తేలడంతో పోలీసులు ఆ గెస్ట్ హౌజ్ పై దృష్టి సారించారు.ఆ అతిథి గృహం బీఆర్ఎస్ అధినేత కుటుంబ సభ్యుడికి అత్యంత సన్నిహితుడైన ఓ ఎమ్మెల్సీదని తెలుస్తోంది. ఇదే వేదికగా భేటీలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీ నేతలను ఫోన్ ట్యాప్ చేసే వారని సమాచారం.

ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలకమైన డెన్ ను ఈ గెస్ట్ హౌజ్ నుంచే నడిపించారని… ఇది రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసినట్లుగా తేలింది. రేవంత్ ను టార్గెట్ చేసేందుకు సులువుగా ఉంటుందని ఇక్కడే డెన్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి..? ఈ తర్వాత ఎలాంటి ప్రణాళికలు రచించాలి.? అనే అంశాలపై ఇక్కడి నుంచే వ్యూహం రచించేవారనే చర్చ నడుస్తోంది. దీంతో ఈ కేసులో ఈ గెస్ట్ హౌజ్ వ్యవహారం కీలకంగా మారిందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, రాదాకిషన్ రావు, భుజంగరావులు ఈ గెస్ట్ హౌజ్ గురించి కీలక సమాచారం వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వారు చెప్పిన సమాచారం ఆధారంగా గెస్ట్ హౌజ్ ను పోలీసులు పరిశీలించారు. అయితే.. అక్కడ ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ధ్వంసం చేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ గెస్ట్ హౌజ్ యజమాని అయిన ఎమ్మెల్సీని విచారించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close