చంద్రబాబును భౌతికంగా నిర్మూలించే కుట్రలు – ఇవన్నీ సాక్ష్యాలే !?

చంద్రబాబును ఫినిష్ చేస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ స్పీక్ర స్థానంలో ఉండి అలా మాట్లాడాల్సిన వ్యక్తి కాదు. అలా మాట్లాడటం తప్పని తెలియక కాదు. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని క్రి్మినాలజీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొంత కాలంగా చంద్రబాబు చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమని.. అంటున్నారు.

చంద్రబాబుపై వైసీపీ చేసిన రాళ్ల దాడిలో వృద్ధుడు మృతి

కొద్ది రోజుల క్రితం యర్రగొండపాలెంలో టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభలో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారు. సెక్యూరిటీ అడ్డుకున్నారు. కానీ చంద్రబాబుపై చేసిన రాళ్ల దాడి కారణంగా ఓటీడీపీ కార్యకర్త గాయపడ్డారు. చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయారు. ఆ రాయి టార్గెట్ చేసింది చంద్రబాబునే. మంత్రి సురేష్ ఆధ్వర్యంలో పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఆ రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడి చేయడానికి పోలీసులు, సురేష్ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లుగా వారి మాటల వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇదంతా చంద్రబాబును ఎలిమినేట్ చేయడానికి చేసిన కుట్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.

చంద్రబాబు ఎక్కడకు వెళ్లిన రాళ్ల దాడులు !

చంద్రబాబు కుప్పం వెళ్లినా రాళ్ల దాడులు చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఏదో ఓ కారణం చూపించి దాడి చేస్తున్నారు. ఇదంతా వైసీపీలోని కొంత మంది పెద్దల కుట్రలతోనే జరుగుతోందని చెబుతున్నారు. ఇది రాజకీయంగా తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదని.. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న వ్యక్తి మీద రాళ్లు వేయాలంటే ఎవరైనా సంకోచిస్తారు.కానీ ఏపీలో అధికార పార్టీ ప్రముఖుల కుట్రలు.. పోలీసుల సహకారంతోనే ఇలాంటి దాడులకు ప్రణాళికలు వేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.

పదే పదే చంద్రబాబు సెక్యూరిటీ బ్రీచ్

చంద్రబాబు సెక్యూరిటీలోకి పదే పదే ఇతర వాహనాలు వస్తున్నాయి. తరచూ అడ్డం పడుతున్నారు. చంద్రబాబు భద్రతను స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా లోపాలు ఉండేలా చేస్తున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్న బహిరంగ రహస్యం. వైసీపీ నేతలు దాడులు చేసే వాతావరాణాన్ని పోలీసులు కల్పిస్తున్నారు. ఇలాంటివి అత్యంత తీవ్రమైన విషయాలు. కానీ తేలికగా తీసుకుంటున్నారు. అదీ కూడా ఉద్దేశపూర్వకంగానే.

పాలకుల మనస్థత్వం అదే !

ఏపీలో పాలకుల మనస్థత్వం అదే. వారు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత దారుణంగా హత్య చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాలకుల నోటి నుండి చంద్రబాబును చంపడం.. ఎలిమినేట్ చేయడం వంటి అంశాలు చాలా సార్లు వచ్చాయి. అధికారం పోతుందన్న అసహనంతో.. ఉన్మాదానికి లోనై.. ఎలాంటి కుట్రలైనా చేయవచ్చన్న అభిభిప్రాయం మానసిక నిపుణుల్లోనూ వినిపిస్తోంది.

చంద్రబాబు ప్రాణానికి ముప్పుపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ?

చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందని..కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతలకు ఎవరికీ లేనంతగా ఇరవై నాలుగు మంది కమెండోలతో భద్రతను కల్పిస్తున్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్ వ్యవస్థ చంద్రబాబుపై జరుగుతున్న రాజకీయ కుట్రలు.. దాడులు పన్నాగాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ ఆషామాషీగా జరుగుతున్న వ్యవహారాలు కాదని.. త్వరలోనే చంద్రబాబుపై జరిగిన అతి పెద్ద కుట్రను కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చేధిస్తాయని టీడీపీ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close