నిమ్మల, అచ్చెన్నలపై అసెంబ్లీకి రాకుండా వేటు..!?

అసెంబ్లీలో దూకుడుగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడులపై సభకు రాకుండా వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ నేడు సమావేశం కానుంది. వీరిద్దరిపై జగన్మోహన్ రెడ్డితో పాటు… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులను చర్చిస్తారు. తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేస్తారు. అయితే అదే సమయంలో.. అసెంబ్లీలో అబద్దాలు చెప్పారంటూ.. సీఎం జగన్, వ్యవసాయ మంత్రి కన్నబాబులపై టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులును మాత్రం పరిశీలించే అవకాశం లేదని చెబుతున్నారు.

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో… నిమ్మల రామానాయుడు పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రామా నాయుడు అంటూ సంబోధించడం ప్రారంభించారు. దీంతో నిమ్మల .. మీరు జైలు రెడ్డా..? అని ప్రశ్నించారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. సభ్యుడిపై స్వయంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇక అచ్చెన్నాయుడుపై వివిధ రకాల కారణాలు చూపుతూ.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. వాటిపై చర్చించనున్నారు. వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే.. అదీ కూడా… అసెంబ్లీ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేసే ఉద్దేశంతోనే ప్రివిలేజ్ కమిటీ భేటీ పెట్టారన్న చర్చ జరుగుతోంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా అసభ్యంగా మాట్లాడటంతో ఆమెను సమావేశాలకు రాకుండా వేటు వేశారు. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ ఒకరిపై వేటు వేస్తే.. తాము ఇద్దరిపై వేటు వేయగలమని వైసీపీ చెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రివిలేజ్ కమిటీ.. వారి వివరణలు కూడాతీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వైసీపీ సభాసంప్రదాయాలను పెద్దగా పట్టించుకోవడంలేదు కాబట్టి…. వెంటనే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమపై వేటు వేస్తే… టీడీపీకి ఉన్న ఇరవై మందిసభ్యుల్ని కూడా ఎదుర్కోలేని వైసీపీ పిరికితనమేనని ప్రచారం చేయాలని ప్రతిపక్ష పార్టీ నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close