చెన్నైలో ఏరియల్ సర్వేకి బయలుదేరిన ప్రధాని మోడి

భారీ వర్షాలతో అతలాకుతం అవుతున్న తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం, ఇరుగుపొరుగు రాష్ట్రాలు, చిత్ర సీమ అందరూ బాసటగా నిలుస్తున్నారు. కేంద్రప్రభుత్వం తక్షణమే రూ.940 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే చెన్నై బయలుదేరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. గత నాలుగయిదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో మొత్తం 269 మంది మరణించినట్లు హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహాయ పడుతోందని, అవసరమయితే ఇంకా అదనపు సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.

ప్రస్తుతం చెన్నైలో ఆర్మీ, నావికాదళం సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్.కు చెందిన 1200 మంది సిబ్బంది, 100 బోట్లు కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇంతవరకు సుమార్ 70,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై విమానాశ్రయంలో 1,500 మంది చిక్కుకొని పోయారు. విమానశ్రయం రన్ వే పై కూడా నీళ్ళు ప్రవహిస్తుండటంతో విమానాలు రద్దయ్యాయి. రైళ్ళు, బస్సులు ఇంతకు ముందే రద్దయ్యాయి. తమిళనాడుని ఆనుకొని ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కురుస్తున్న భారీ వానల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరిగిందని రాజ్ నాద్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.330 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close